Thursday, March 5, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Andhra Pradesh: సీఎం కాన్వాయ్ కోసం కారు...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Andhra Pradesh: సీఎం కాన్వాయ్ కోసం కారు స్వాధీనంపై సీఎంవో సీరియస్.. వారిపై సస్పెన్షన్ వేటు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 ఒంగోలులో నిన్న తిరుపతి వెళ్లే ప్రయాణికుడి కారు స్వాధీనం ఘటనపై సీఎం కార్యాలయం ఆరా తీసింది. కారు స్వాధీనం ఘటనపై పూర్తి వివరాలు సేకరించింది.

Andhra Pradesh: సీఎం కాన్వాయ్ కోసం కారు స్వాధీనంపై సీఎంవో సీరియస్.. వారిపై సస్పెన్షన్ వేటు

Ongole: ఒంగోలు ఆర్టీఓ అధికారుల ఓవరాక్షన్‌పై ప్రభుత్వం స్పందించింది. టీవీ9 ప్రసారం చేసిన వరస కథనాలతో స్వయంగా రంగంలోకి దిగిన CMO అధికారులు ఇద్దరు అధికారులపై వేటు వేశారు. ప్రయాణికులను బెదిరించి కారును తీసుకెళ్లిన ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెన్షన్‌ చేశారు. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ సంధ్య, హోంగార్డు తిరుమలరెడ్డిని సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులో RTO అధికారులు ఓవరాక్షన్‌ చేశారు. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. రాత్రంతా బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్‌ ఒంగోలు పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వినుకొండ(Vinukonda) నుంచి తిరుమల(tirumala)కు రెంట్‌ కారులో బయలుదేరింది శ్రీనివాస రావు కుటుంబం. టిఫిన్ చేసేందుకు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ దగ్గర ఆగారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న రవాణా శాఖ అధికారులు సీఎం టూర్‌కు కార్లు కావాలంటూ.. బలవంతంగా ఆ కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అయితే తాము కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తున్నామని… కారును ఇవ్వమని అధికారులను శ్రీనివాసరావు ఫ్యామిలీ ఎంత వేడుకున్నా కనికరించలేదు. కారు ఇచ్చేది లేదంటూ కావాలంటే బస్సులో వెళ్లాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఇక చేసేది ఏమి లేక.. బస్టాండ్‌కు చేరుకొని వినుకొండ నుంచి మరో రెంట్‌లో తిరుమలకు వెళ్లారు. అయితే రవాణా శాఖ అధికారులు వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన కోసమంటూ రోడ్లపై దూర ప్రాంతాలకు వెళ్లే వారి వాహనాలను ఆపి ఆధీనంలోకి తీసుకోవడం ఏంటని మండిపడ్డారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఇద్దరు అధికారులపై వేటు వేశారు. నోటీసులు కూడా జారీ చేశారు.

andhra pradesh: సీఎం కాన్వాయ్ కోసం కారు స్వాధీనంపై సీఎంవో సీరియస్.. వారిపై సస్పెన్షన్ వేటు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this