Tuesday, January 6, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
NationalBudget 2024: బడ్జెట్‌లో ఎన్‌పిఎస్, ఆయుష్మాన్‌పై భారీ...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

Budget 2024: బడ్జెట్‌లో ఎన్‌పిఎస్, ఆయుష్మాన్‌పై భారీ ప్రకటనలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Budget 2024: రేపు ప్రవేశ పెట్టే సాధారణ బడ్జెట్‌లో కొత్త పెన్షన్ సిస్టమ్, ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక భద్రత సంబంధిత పథకాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు ఉండవచ్చు. అయితే, ఆదాయపు పన్ను విషయంలో కాస్త ఊరట లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం, గ్రామీణ, వ్యవసాయ కేటాయింపుల పెంపు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి గాను వరుసగా ఏడవ సారి బడ్జెట్‌ను, నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం మూడవ టర్న్ మొదటి బడ్జెట్‌ను మంగళవారం, జూలై 23న లోక్‌సభలో సమర్పించనున్నారు.

ప్రఖ్యాత ఆర్థికవేత్త, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపిఎఫ్‌పి) ప్రొఫెసర్ ఎన్‌ఆర్ భానుమూర్తిని బడ్జెట్‌లో సామాజిక భద్రతా పథకాలపై అంచనాల గురించి అడిగినప్పుడు ఎన్‌పిఎస్, ఆయుష్మాన్ భారత్‌పై కొన్ని ప్రకటనలు ఆశిస్తున్నట్లు చెప్పారు. పింఛన్‌ పథకాలపై రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్‌పీఎస్ (న్యూ పెన్షన్ సిస్టమ్)కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆయుష్మాన్ భారత్ గురించి ప్రధాని కొన్ని విషయాలు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ, 70 ఏళ్లు పైబడిన పౌరులందరికీ 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ యోజన పరిధిలోకి తీసుకువస్తామని ప్రధాని మోడీ చెప్పారు. మెరుగైన జీవితం, ఉపాధి కల్పించడంపై పార్టీ దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. కోవిద్ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యూహంలో సామాజిక భద్రతా పథకాలు ముఖ్యమైనవి. అయితే, ఆరోగ్య రంగంలో బీమా పథకాలు ఈ వ్యవస్థను మరింత ఖరీదైనవిగా చేస్తాయి.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this