Tuesday, January 27, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Nationalచిన్న సమస్య వచ్చింది.. భారత్‌లో విమాన సేవలకు...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

చిన్న సమస్య వచ్చింది.. భారత్‌లో విమాన సేవలకు అంతరాయంపై రామ్మోహన్ నాయుడు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలుగుతుండడతో భారత్‌లో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. ఎయిర్‌వేస్‌కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన అజూర్ అనే క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌లో చిన్న సమస్య వచ్చిందని అన్నారు. దీంతో ప్రధానంగా అమెరికాలో సమస్య అధికంగా వస్తుందని చెప్పారు. ఇదే విషయమై తమ కార్యదర్శితో మాట్లాడానని తెలిపారు. మన దేశంలో టెక్నికల్ సాఫ్ట్‌వేర్‌ సిస్టం నుంచి మాన్యువల్ సిస్టంలోకి మూవ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతానికి భారత్‌లో దానికి సంబంధించి సమస్య ఏదీ లేదని తెలిపారు.

ప్రయాణికులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాన్యువల్ పద్ధతులలో ఆపరేషన్స్ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఎయిర్ లైన్స్, అథారిటీ ఆఫ్ ఇండియా సమన్వయంతో పని చేస్తూ ప్రయాణికులకు సేవలందించాలని అన్నారు. విమానాల ఆలస్యం వల్ల నిలిచిపోయిన ప్రయాణికులకు సీట్లు, ఆహారం, నీరు అందించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ మెరుగుపరచాలని తెలిపారు. ప్రయాణికుల సేవకు అదనపు సిబ్బందిని ఉపయోగించాలని చెప్పారు. మైక్రోసాఫ్ట్ నిపుణులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

విశాఖ విమానాశ్రయంలో..
విశాఖలో విమానాల ఆపరేషన్‌లో తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారు. మాన్యువల్‌గా బోర్డింగ్ క్లియర్ చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో జాప్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల రద్దీ బాగా పెరిగింది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this