Wednesday, February 18, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Electricity Charges in AP: ఏపీలో కొత్త...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Electricity Charges in AP: ఏపీలో కొత్త విద్యుత్ ఛార్జీలు ఇవే.. వారికి ఉరటనిచ్చిన ప్రభుత్వం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Electricity Charges in AP: ఆంధ్రప్రదేశ్ (Andhra
Pradesh) లో నూతన విద్యుత్ ఛార్జీలను (Electricity Charges) ఏపీఈఆర్సీ
ప్రకటించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో నూతన ఛార్జీలు అమల్లోకి
రానున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యుత్ ఛార్జీలను ఈఆర్సీ ప్రకటిచింది. రాయితీలను
తగ్గించకుండా.. చిన్నచిన్న మార్పులతో కొత్త విద్యుత్ టారిఫ్ ను ఏపీ ఈఆర్సీ
ఛైర్మన్ నాగార్జున రెడ్డి ప్రకటించారు.

నూతన టారిఫ్ లో ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఇకపై కనీస ఛార్జీలు ఉండవని
ప్రకటించింది. కనీస ఛార్జీల స్తానంలో ఇకపై కిలో వాట్ కు రూ.10 చెల్లిస్తే
సరిపోతుందని నాగార్జున రెడ్డి తెలిపారు. అలాగే సగటు యూనిట్ ధర రూ.7.17
నుంచి రూ.6.37కు తగ్గిస్తున్నట్టు నాగార్జున రెడ్డి వెల్లడించారు.

ఇక ఎస్సీ, ఎస్టీ కాలనీలు, కులవృత్తులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కొనసాగనుంది.
దీని వల్ల ప్రభుత్వంపై రూ.1,657 కోట్ల భారం పడనుంది. అలాగే ఫంక్షన్ హాళ్లకు
ఇకపై ఫిక్స్డ్ ఛార్జీలుండవని నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు.

ఉచిత విద్యుత్ కేటగిరీ విషయానికి వస్తే గిరిజనులు, ఎస్సీ కాలనీల్లో నెలకు
200 యూనిట్లు, లాండ్రీలు నడుపుతున్న రజకులకు నెలకు 150 యూనిట్లు, చేనేత
కార్మికులు, బీపీఎల్ కింద ఉన్న స్వర్ణ వృత్తికారులకు నెలకు 100 యూనిట్లు,
అత్యంత వెనుకబడిన వర్గాలకు నెలకు 100 యూనిట్లు ఉచితంగా ఇవ్వనున్నారు.

పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చే అవకాశం లేదని నాగార్జున
రెడ్డి స్పష్టం చేశారు. ఇక రైతులకు ఉచిత విద్యుత్‌ పథకం కింద రూ.7,297
కోట్లు భరించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

ప్రతి ఏటా డిస్కమ్ లకు రూ.11,741.18 లోటు వస్తుందని.., ఇందులో రూ.4,307.38
కోట్ల భారం వినియోగదారులు, ప్రభుత్వంపై పడకుండా ఉండే ప్రతిపాదనలను
ఆమోదించినట్లు తెలిపారు.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this