JAC Meeting: రాష్ట్ర ప్రభుత్వఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ )సెక్రటేరియట్ సమావేశం ఈనెల 20వ తేదీ విజయవాడ ఏపీ ఎన్జీవో హోంలో నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ జి హృదయ రాజు తెలిపారు. ఈనెల 21న ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై సి ఎస్ ఆధ్వర్యంలో కార్యదర్శిల సమావేశం జరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది .ఉదయం పదిన్నర గంటలకు జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించే జేఏసీ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు సంబంధించి అనేక సమస్యలపై చర్చించనున్నట్లు హృదయ రాజు తెలిపారు. పదకొండవ పిఆర్సి ,సి పి ఎస్ రద్దు ,పెండింగ్ డీఏలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ,జిపిఎఫ్, సరెండర్ లీవ్ ,మెడికల్ రీయంబర్సుమెంట్ , గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర బిల్లులు మంజూరు జేఏసీలో ఖాళీ పోస్టుల భర్తీ, ఇతర డిమాండ్లను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు హృదయరాజు తెలిపారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సమావేశానికి ఏపీ జెఎసి సెక్రటేరియట్ సభ్యులు తప్పక హాజరుకావాలని హృదయ రాజు పేర్కొన్నారు.
JAC Meeting: 20న ఏపీ జేఏసీ సమావేశం
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.