Sunday, March 1, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Compassionate Appointments: కారుణ్య నియామకాలు ...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Compassionate Appointments: కారుణ్య నియామకాలు చేపట్టాలి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • కొవిడ్‌తో మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం..
  • నవంబరు నాటికి ప్రక్రియ పూర్తవ్వాలి..
  • అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం..

న్యూస్ టోన్, అమరావతి:  కొవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. నవంబరు 30నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కొవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ముఖ్యమంత్రి సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో సిబ్బంది నియామకాల్లో జాతీయ ప్రమాణాలను అనుసరించాలని, దీనిలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని సీఎం ఆదేశించారు. వివిధ ఆసుపత్రుల్లోని ఖాళీలు, అవసరాల మేరకు సిబ్బంది నియామకానికి క్యాలెండర్‌ రూపొందించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూలో పోస్టుల భర్తీకి అక్టోబరు 20న నోటిఫికేషన్‌ ఇస్తామని, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి డిసెంబరు 10న నియామక ఉత్తర్వులు అందజేస్తామని తెలిపారు. డీఎంఈలో పోస్టులకు అక్టోబరు 20న నోటిఫికేషన్‌, డిసెంబరు 5న నియామక ఉత్తర్వులు ఇస్తామని అన్నారు.

ఏపీవీవీపీలో పోస్టులకు అక్టోబరు20 నుంచి 23 వరకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి డిసెంబరు 21-25 మధ్య నియామక ఉత్తర్వులు అందజేస్తామని వెల్లడించారు. కొత్తగా 176 పీహెచ్‌సీల నిర్మాణంపై వెంటనే దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించగా.. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లోగా పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.

అక్టోబరు నెలాఖరుకు ఆక్సిజన్‌ ప్లాంట్లు సిద్ధం..

రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 140 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్ల (పీఎస్‌ఏ) పనులు చురుగ్గా జరుగుతున్నాయని, ఈ నెలాఖరుకు అవన్నీ అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలోని 12,833 సచివాలయాల పరిధిలో ఒక్క కొవిడ్‌ కేసు కూడా లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,034 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 12 జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0 నుంచి 3శాతంలోపు, ఒక జిల్లాలో 3 నుంచి 5 శాతంలోపు ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,33,80,259 మంది తొలి డోస్‌ వ్యాక్సిన్‌, 1,66,58,195 మంది రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this