Wife and Husband: పెళ్లై ఏడాది కాలేదు.....

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Wife and Husband: పెళ్లై ఏడాది కాలేదు.. అప్పుడే పాడుబుద్ధి పుట్టింది.. చివరికి ఏం జరిగిందంటే..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 భార్యాభర్తల బంధం (Wife And Husband) అనేది నమ్మకం అనే పునాదిపై నిలబడుతుంది. ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరిలో అనుమానం మొదలైనా ఆ కాపురం కలహాలతో నిండిపోతుంది.

భార్యాభర్తల బంధం (Wife And Husband) అనేది నమ్మకం అనే పునాదిపై నిలబడుతుంది. ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరిలో అనుమానం మొదలైనా ఆ కాపురం కలహాలతో నిండిపోతుంది. అంతేకాదు జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తుంది. అలా అనుమానం పెనుభూతమైన ఓ భర్త అగ్నిసాక్షిగా తీళికట్టిన భార్యను అంతమొందిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) డోన్ పట్టణంలోని కొత్తపేటకు చెందిన చౌడప్ప, లక్ష్మి దేవిల కుమార్తె బాల లక్ష్మిదేవికి ఏడాది క్రితం వెల్దుర్తి మండలం గువలకుంట్లకు చెందిన సుధాకర్కి ఇచ్చి పెళ్లి చేశారు. సుధాకర్ నంద్యాలలోని వార్డు సచివాలయ సంక్షేమ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. లక్ష్మి దేవి వెంకటనాయుని పల్లె గ్రామా సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వర్తిస్తోంది.
పెళ్లైన కొత్తలో వీరి కాపురం సజావుగానే సాగింది. ఐతే కొంతకాలానికి లక్ష్మి దేవిపై అనుమానం పెంచుకున్న సుధాకర్ తరుచూ ఆమెను వేధిస్తున్నాడు. ఐతే తనపై అతి ప్రేమతోనే అలా చేస్తున్నాడని భావించిన ఆమె భర్త వేధింపులను భరిస్తూ వస్తోంది. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తన ఆవేదనను తల్లిదండ్రులతో చెప్పుకుంది. వారు పెద్దల సమక్షంలో పలుసార్లు సుధారక్ కు నచ్చజెప్పారు. ఆయినా సుధాకర్లో మార్పు రాలేదు.
వేధింపులు మరింత ఎక్కువ కావడంతో కొన్నినెలల క్రితం డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సుధాకర్ మరింత రెచ్చిపోయాడు. తనమీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అంటూ రెండుసార్లు దాడికి యత్నించాడు. బెదిరిపోయిన ఆమె ఇక అతడితో తెగదెంపులు చేసుకోవడమే బెటర్ అని భావించింది. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మీదేవి తన విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వస్తుండగా.. డోన్ శివారులో ఆమెను అడ్డుకొని దాడికి యత్నించాడు. డ్డుకోబోయిన సహోద్యోగిని బెదిరించడంతో అతడు పారిపోయాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. దీంతో లక్ష్మీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి జీతం, జీవితం. అన్నీ బావున్నా సుధాకర్ మెదడులో పుట్టిన అనుమానపు పురుగు నిండు జీవితాన్ని బలితీసుకుంది.
ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో నరేష్ అనే వ్యక్తి.. నందిని అనే యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. తీరా ఆమె పెళ్లి చేసుమని నిలదీయడంతో గ్రామశివారులోకి పొదల్లోకి తీసుకెళ్లి నోట్లో పురుగుల మందు తాగించి.. గొంతు నులిమి హత్య చేశాడు. ఐతే పోలీసుల తన కోసం వెతుకుతున్నారని తెలిసి లొంగిపోయాడు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this