Vijayawada Durga Temple: దుర్గమ్మ ఆల‌యంలో మరో...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Vijayawada Durga Temple: దుర్గమ్మ ఆల‌యంలో మరో వివాదం.. అడిగితే నో కామెంట్ అంటున్న అధికారులు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జ‌రుగుతూనే ఉంటుంది. ఎంత‌మంది అధికారులు మారిన‌ప్పటికీ అక్కడి ప‌రిస్థితి మాత్రం మార‌డం లేదు.

Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం జ‌రుగుతూనే ఉంటుంది. ఎంత‌మంది అధికారులు మారిన‌ప్పటికీ అక్కడి ప‌రిస్థితి మాత్రం మార‌డం లేదు. సుమారు ఏడాదిన్నరగా ఆల‌యంలో శానిటేష‌న్ కాంట్రాక్ట్ వివాదం కొన‌సాగుతోంది. అప్పట్లో ఈవోగా ఉన్న సురేష్ బాబు.. అర్హత లేని వారికి టెండ‌ర్లు అప్పగించ‌డంపై తీవ్ర దుమారం చెల‌రేగింది. అప్పటి నుంచి ఇప్పటివ‌ర‌కూ ఈవివాదానికి ఫుల్ స్టాప్ ప‌డ‌లేదు. అమ్మవారి ఆల‌యంలో పారిశుద్ధ్య ప‌నుల కాంట్రాక్ట్ కోసం ఇప్పటికి ఆరుసార్లు టెండ‌ర్లు పిలిచారు అధికారులు. ప్రతిసారి ఏదో ఒక కార‌ణంతో కాంట్రాక్టర్ ఎంపిక మాత్రం వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో మ‌రోసారి టెండ‌ర్లు పిల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో పిలిచిన టెండ‌ర్లలో L 2 గా నిలిచిన హైద‌రాబాద్‌కు చెందిన కేఎల్ టెక్ సంస్థకు అప్పటి ఈవో బాధ్యతలు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ.. దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అక్షింత‌లు వేసింది. దీంతో మ‌ళ్లీ టెండ‌ర్లు పిల‌వాల‌ని సూచించారు.
గ‌త నెల 13న టెండ‌ర్లు ఓపెన్ చేసిన‌ప్పటికీ.. ఇంత‌వ‌ర‌కు ఎవ‌రినీ ఫైన‌ల్ చేయ‌లేదు. ఎల్ 1 గా త‌క్కువ ధ‌ర‌కు లామెక్లాన్ ఇండియా కోట్ చేసింది. అయినా అధికారికంగా ఎలాంటి ప్రక‌ట‌న చేయ‌లేదు అధికారులు. ఈ క్రమంలోనే అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండ‌ర్లపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆల‌య ఈవో భ్రమ‌రాంబను టీవీ9 వివ‌ర‌ణ కోరగా.. దీనిపై ప్రస్తుతం ఏమీ మాట్లాడ‌లేన‌ని.. కోర్టు నిబంధ‌న‌ల ప్రకారం ముందుకెళ్తామ‌ని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం కాంట్రాక్ట్ చేస్తున్న సంస్థకు నెల‌కు 24 ల‌క్షలు మాత్రమే చెల్లిస్తున్నట్లు ఈవో చెప్పారు. ఇదిలా ఉంటే కేఎల్ టెక్ సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య ప‌నులు చేస్తున్న కార్మికులు మాత్రం లబోదిబో మంటున్నారు. త‌మ‌కు కార్మిక చ‌ట్టం ప్రకారం జీతాలు చెల్లించ‌డం లేద‌ని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ముగిసేదెప్పటికో వేచి చూడాలి.
vijayawada durga temple: దుర్గమ్మ ఆల‌యంలో మరో వివాదం.. అడిగితే నో కామెంట్ అంటున్న అధికారులు..!

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this