గడచిన 36 రోజుల్లో ఒకే పాఠశాలకు చెందిన...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

గడచిన 36 రోజుల్లో ఒకే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థుల మృతి… అందరూ ఒకే గ్రామంలో చదివే పిల్లలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • తెలియని కారణాలు.. ఆందోళనలో గ్రామస్థులు
  • 36 రోజుల్లో నలుగురు విద్యార్థుల మృతి

36 రోజుల వ్యవధిలో ఒకే గ్రామంలోని పాఠశాలలకు చెందిన నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరి కొంతమంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇందుకు కారణాలు తెలియక భయాందోళనతో గ్రామస్థులు బడులను మూసేయించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో చోటు చేసుకుంది. బోడిగూడెంలో జిల్లా పరిషత్తు పాఠశాలకు కాస్త దూరంలోనే ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ చదివే పదో తరగతి విద్యార్థి మెంటి మధు(15) జ్వర లక్షణాలతో రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. అంతకుముందు.. ఆరో తరగతి విద్యార్థి పేరిబోయిన రామాంజనేయులు(11) అక్టోబరు 30న, తొమ్మిదో తరగతి చదివే జక్కు శ్రీను(14) నవంబరు 25న, 8వ తరగతి విద్యార్థి కాటుబోయిన ప్రశాంత్‌(13) నవంబరు 26న మృత్యువాత పడ్డారు. ఈ బడులకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు జ్వర సంబంధిత లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల వరుస మరణాలకు స్పష్టమైన కారణాలు తెలియక గ్రామంలో ఆందోళన నెలకొంది. పరిస్థితులు చక్కబడే వరకు పాఠశాలలు నిర్వహించొద్దని     గ్రామస్థులు శనివారం విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు గ్రామంలో పర్యటించారు. అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో డెంగీ జ్వరాలుగా పేర్కొంటున్నప్పటికీ తమ పరిశీలనలో స్పష్టం కాలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి నాయక్‌ తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి రేణుక మాట్లాడుతూ పరిస్థితులు చక్కబడేంత వరకు పాఠశాలలు మూసేయడం తగదన్నారు. విద్యార్థులను బడులకు పంపించే విషయమై తల్లిదండ్రులు పునరాలోచించాలని సూచించారు.

36 రోజుల్లో నలుగురు విద్యార్థుల మృతి అందరూ ఒకే గ్రామంలో చదివే పిల్లలు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this