Karthika Masam: కార్తీకమాసం చివరి రోజు.. పోలి...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Karthika Masam: కార్తీకమాసం చివరి రోజు.. పోలి స్వర్గం కథ విన్నా.. ఒక్క దీపం వెలిగించినా.. అష్టైశ్వర్యాలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Karthika Masam: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీకమాసం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసం విశిష్టత గురించి పురాణాల్లో కూడా ఉంది. అధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న కార్తీకమాసంలో నెల రోజుల పాటు నది స్నానం, శివాలయ దర్శనం, దానం వంటి కార్యక్రమాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజు కార్తీక మాసం చివరి రోజు.. దీంతో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది.. ‘పోలిస్వర్గం’ కథ.. కార్తీకమాసం చివరి రోజు సందర్భంగా పోలి స్వర్గం కథ తెలుసుకుందాం..

అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం.. ఆ కుటుంబంలో ఐదుగురుకొడుకులు ఐదుగురు కోడళ్లు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలి.. ఆమెకి చిన్నతనం నుంచి దైవం అంటే భక్తి.. పూజలు వ్రతలన్నా మహా ఆసక్తి.. అయితే అత్తగారికి చిన్న కోడలు పోలి అంటే అసూయ తాను మాత్రమే భక్తురాలనే నమ్మకం. అహంభావం.. దీంతో కార్తికమాసంలో తన నలుగురు కోడళ్ళు తీసుకుని అత్తగారు రోజూ నది స్నానమాచరించి.. దీపాలు వెలిగించి వచ్చేది. అంతేకాదు ఎక్కడ పోలి నది స్నానము చేసి దీపం వెలిగిస్తుందో.. అని అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఇంట్లో లేకుండా చేసి అత్తగారు మిగిలిన కోడళ్లతో వెళ్ళేది. అయితే పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసి.. కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. తాను పెట్టిన దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి.

కార్తీకమాసం చివరికి అమావాస్య రోజున నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు తన నలుగురు కోడళ్లతో కలిసి బయల్దేరింది. వెళ్తూ.. పోలికి ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్ళింది. పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది. పోలి తనకు వచ్చిన అవాంతరాలను అధిగమించి దీపం పెట్టిన భక్తి దేవతలను ఆకర్షించింది. దీంతో పోలిని బొందితో స్వర్గానికి తీస్కుని వెళ్ళడానికి విమానం వచ్చింది. అయితే ఆ విమానాన్ని చూసిన అత్తగారు, నలుగురు కోడళ్ళు తమకోసమే అనుకుని సంతోషపడ్డారు. అయితే ఆ విమానంలో పోలి కనిపించడంతో ఆశ్చర్యపోయారు. అయితే పోలితో పాటు తాముకూడా వెళ్లాలని.. ఆమె కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెప్పి.. వారిని కిందకు దించేశారు.

ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ రోజున పోలి కథను చెప్పుకుని బ్రహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు.

karthika masam: కార్తీకమాసం చివరి రోజు.. పోలి స్వర్గం కథ విన్నా.. ఒక్క దీపం వెలిగించినా.. అష్టైశ్వర్యాలు..

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this