Thursday, March 5, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Transport Department Anantapur:బాబోయ్ బైక్‌కు ఒక్కసారే రూ.8వేల...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Transport Department Anantapur:బాబోయ్ బైక్‌కు ఒక్కసారే రూ.8వేల జరిమానా.. ఆ తప్పు చేస్తే బుక్కైపోతారు, బీ అలర్ట్!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వాహనాల డ్రైవింగ్‌ లైసెన్సులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, పర్మిట్లు వంటివి గడువు ముగిసినా, లేకపోయినా రవాణాశాఖ అంతగా పట్టించుకోలేదు. ఇకపై వీటన్నింటిపైనా జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు.

  • నిబంధనలు పాటించకపోతే జరిమానాల మోత
  • ఓ బైక్‌కు ఏకంగా రూ.8వేలు ఫైన్ విధించారు
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన చలానా
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇకపై వాహనాలకు డాక్యుమెంట్లు లేకపోతే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటివరకు వాహనాల డ్రైవింగ్‌ లైసెన్సులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, పర్మిట్లు వంటివి గడువు ముగిసినా, లేకపోయినా రవాణాశాఖ అంతగా పట్టించుకోలేదు. ఇకపై వీటన్నింటిపైనా జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలని.. నిబంధనలు పాటించని వాహనదారుల పై జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ బైక్‌కు విధించిన జరిమానా స్లిప్ వైరల్ అవుతోంది.
అనంతపురం జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ బైక్‌ను ఆపి భారీగా జరిమానాలు విధించారు. సాయినాథ్ రెడ్డి అనే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్ సర్టిఫికేట్, హెల్మెట్ లేకపోవడంతో ఏకంగా రూ.8వేల జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ.5వేలు, ఇన్స్యూరెన్స్ లేనందుకు రూ.2వేలు, హెల్మెట్ పెట్టుకోనందుకు రూ.వెయ్యి ఫైన్ వేశారు. ఈ స్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనదారులు జాగ్రత్త వహించాలని.. సంబంధిత డాక్యుమెంట్లను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు.
మొన్నటి వరకు కరోనా కారణంగా రవాణాశాఖ అధికారులు కూడా తనిఖీలను చేయలేకపోయారు. ఇప్పుడు కాస్త ఊరట రావడంతో వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లను తనిఖీలు చేయాలని నిర్ణయించారు. అందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. అంతేకాదు తనిఖీలు పెంచి మార్చి లోగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరాలని భావిస్తున్నారట.
transport department anantapur:బాబోయ్ బైక్‌కు ఒక్కసారే రూ.8వేల జరిమానా.. ఆ తప్పు చేస్తే బుక్కైపోతారు, బీ అలర్ట్!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this