Tuesday, March 3, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Anantapur: టీచరమ్మా ఇదేం పని? సెలవు రోజుల్లో...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Anantapur: టీచరమ్మా ఇదేం పని? సెలవు రోజుల్లో విద్యార్థులతో ఇలా.. ఊహించని షాక్!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అనంతపురం జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెలవు రోజుల్లో పిల్లలతో..!

అనంతపురం జిల్లాలో ఓ టీచర్మ నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మన్నీల జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు శివమ్మ చేసిన పనికి అంతా షాకయ్యారు. చట్టప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడమే నేరం. కానీ, అన్నీ తెలిసిన ఓ టీచర్‌ పాఠశాలలోని విద్యార్థులతో భవన నిర్మాణ పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. ఆదర్శనగర్‌లో ఆమె సొంత ఇంటి నిర్మాణానికి కార్మికులుగా పాఠశాల విద్యార్థులను వాడుకోవడం తీవ్ర కలకం రేపుతోంది. ప్రతి ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో విద్యార్థులతో ఇటుకలు, సిమెంటు, ఇసుక మోయిస్తున్నారు.
విద్యార్థుల చేత పనులు చేయించుకోవడాన్ని గత కొన్ని రోజులుగా ఆదర్శ్‌నగర్ కాలనీ వాసులు గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఈ వ్యవహారంపై మీడియాకు సమాచారం అందించారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను, స్థానికులపై ఉపాధ్యాయురాలు శివమ్మ, ఆమె భర్త ఫైరయ్యారు. మీడియా సభ్యులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. నగరపాలక సంస్థకు చెందిన ఇంటింటా చెత్తసేకరించే తోపుడుబండ్లను కూడా ఈ టీచరమ్మ వినియోగించుకున్నారు. పిల్లల ఈ బండ్లలోనే ఇటుకలు, సిమెంట్ తీసుకెళ్తున్నారు. ఈ దృశ్యాలు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. నగరపాలకకు చెందిన చెత్తబండిని తీసుకున్నా, విద్యార్థులతో పనిచేయిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా తనకు కూడా ఫిర్యాదులు వచ్చాయన్నారు. డిప్యూటీ డీఈవో మీనాక్షిని విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
కాగా, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే వారి చేత పనులు చేయించుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయురాలు శివమ్మపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
anantapur: టీచరమ్మా ఇదేం పని? సెలవు రోజుల్లో విద్యార్థులతో ఇలా.. ఊహించని షాక్!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this