AP Employees: ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోన్న...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

AP Employees: ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోన్న ఏపీ ఉద్యోగులు.. రాజీ ప్రసక్తే లేదని స్పష్టం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 AP Employees: ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ సంఘాలు వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పాయి. పీఆర్‌సీ అమలుపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఉద్యోగుల సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. పీఆర్‌సీ సాధన కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వం పీఆర్‌సీ అమలు విషయంలో కాలయాపన చేస్తుందన్న కారణంతో ఉద్యమ కార్యచరణను ప్రకటించాయి. అయితే విధిలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రేపటి నుంచి (డిసెంబర్‌ 7) నుంచి కార్యా చరణకు దిగుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ నేతలు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రభుత్వాలను తారుమారు చేసే శక్తి తమకు ఉందని ఉద్యోగులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఉద్యమ కార్యచరణలో భాగంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు మొత్తం 71 డిమాండ్లను ఉంచాయి. ఇందులో ప్రధానమైనవి.. పిఆర్సీ 40 నుంచి 60 శాతం పెంచడం, సిపిఎస్ ( కంట్రిబ్యూటర్ పెన్సన్స్ స్కీమ్) రద్దు చేయడం, పెండింగ్‌లో ఉన్న డిఏల వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే జిపిఎఫ్, జిఎల్ ఐ బకాయిలు రూ.1600 కోట్లను విడుదల చేయాలన్నారు. వీటితో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రెగ్యులైజేషన్ చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులకు హామీల అమలు చేయాలని ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఉద్యోగ సంఘాల కార్యాచరణ ఇలా ఉండనుంది..

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యోగ సంఘాలు తమ యాక్షన్‌ ప్లాన్‌ను ప్రకటించాయి. ఇందులో భాగంగా డిసెంబర్‌ 7 నుంచి 10 వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారు. అనంతరం 10వ తేదీని లంచ్‌ టైమ్‌లో నిరసనలు తెలపనున్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే 13, 16వ తాలుకా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఇక 21న అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు, 27న విశాఖ, 30న తిరుపతి, జనవరి 3న ఏలూరు 6న ఒంగోలులో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ప్లాన్‌ చేసుకున్నాయి.

ap employees: ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ సంఘాలు వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పాయి. పీఆర్‌సీ అమలుపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి....

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this