Arya Tamilanadu : తల్లి ఐసీయూలో, తండ్రి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Arya Tamilanadu : తల్లి ఐసీయూలో, తండ్రి జైల్లో.. ఆకలితో ఏడుస్తున్న 4నెలల చిన్నారి పట్ల మహిళా పోలీసు అధికారిణి ఔదార్యం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 తల్లి అస్వస్థతకు గురికావడంతో పసికందు ఆకలితో ఎడతెగకుండా ఏడుస్తూనే ఉంది. ఇది చూసిన అధికారి ఆర్య ముందుకొచ్చి ఏడుస్తున్న పాపకు పాలిచ్చి, ఆ చిన్నారిని శాంతింపజేసి చివరికి నిద్రపోయేలా చేసింది. ఓ కేసులో నిందితురాలైన పసిపాప తల్లి జైలులో ఉంటోంది. జైలులో ఉన్న మహిళ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఎర్నాకుళంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తీసుకువచ్చారు.

ఒక మహిళా పోలీసు అధికారిణి ఔదార్యం చూపించింది. ఓ నిందితురాలి నాలుగు నెలల పసిబిడ్డను అక్కున చేర్చుకుని తల్లిలా పాలిచ్చి కడుపునింపింది. ఆకలితో ఉన్న బిడ్డను చూసి చలించిపోయిన ఆ లేడీ పోలీస్‌ ఖాకీ డ్రెస్‌ వెనుక ఉన్న తల్లి మనసు కరిగిపోయింది. వెంటనే పసిబిడ్డను దగ్గరకు తీసుకుని పాలుపట్టిచింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. కాగా, మహిళ అధికారిణి చేసిన పని అందరి హృదయాలను కదిలించింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు పోలీసు సిబ్బంది ఇదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో విషయం నెట్టింట సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలిసిన సమాచారం మేరకు…పాప తల్లి – బీహార్‌లోని పాట్నా నివాసి – కొచ్చిలోని ఎర్నాకులం జనరల్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పాట్నా వాసి నలుగురు పిల్లలను చూసుకునే వారు లేకపోవటంతో వారిని సహాయం కోసం గురువారం కొచ్చి సిటీ మహిళా స్టేషన్‌కు తీసుకువచ్చారు. తల్లి అస్వస్థతకు గురికావడంతో పసికందు ఆకలితో ఎడతెగకుండా ఏడుస్తూనే ఉంది. ఇది చూసిన అధికారి ఆర్య ముందుకొచ్చి ఏడుస్తున్న పాపకు పాలిచ్చి, ఆ చిన్నారిని శాంతింపజేసి చివరికి నిద్రపోయేలా చేసింది. ఓ కేసులో నిందితురాలైన పసిపాప తల్లి జైలులో ఉంటోంది. జైలులో ఉన్న మహిళ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఎర్నాకుళంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తీసుకువచ్చారు.

ఆస్పత్రిలో మోహరించిన పోలీసు సిబ్బంది మిగిలిన పిల్లలకు కూడా ఆహారం తినిపించారు. ప్రస్తుతం నలుగురు పిల్లల పరిస్థితి బాగానే ఉంది. పేదరికం కారణంగా స్త్రీ వారిని సరిగ్గా పోషించలేకపోయింది. ఆమె తనను తాను చూసుకోలేక అస్వస్థతకు గురైంది. ఇక ఇప్పుడు ఆమె చికిత్స ఖర్చులను మహిళా పోలీసు సిబ్బంది భరిస్తున్నారు. దీంతో బాధిత మహిళ పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. పోలీసుల ఔదర్యాన్ని చూసి ప్రజలు ఆమెను ప్రశంసించారు.

എറണാകുളം ജനറൽ ആശുപത്രിയിൽ ഐസിയുവിൽ അഡ്മിറ്റായ പാട്ന സ്വദേശിയുടെ 4 കുട്ടികളെയാണ് നോക്കാൻ ആരും ഇല്ലാത്തതിനാൽ രാവിലെ കൊച്ചി സിറ്റി വനിതാ സ്റ്റേഷനിൽ എത്തിച്ചത്. അതിൽ 4 മാസം പ്രായമായ കുഞ്ഞിന് ഫീഡിങ് മദർ ആയ ആര്യ മുലപ്പാൽ ഇറ്റിച്ച് വിശപ്പകറ്റി ❤️❤️

കുട്ടികളെ ശിശു ഭവനിലേക്ക് മാറ്റി.. pic.twitter.com/kzcrzq0hh6

— Remya Rudrabhairav (@RMahatej) November 23, 2023


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this