UncategorizedCollector Visit to ZP High School...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Collector Visit to ZP High School … వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Collector Visit to ZP High School గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ గత కొంతకాలంగా క్షేత్రస్థాయి పర్యటలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పాఠశాలలు, వైద్యశాలల్లో తనిఖీలు చేస్తూ వాస్తవ పరిస్థితిలు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన ఆమెకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

Collector Visit to ZP High School

జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తనిఖీ చేస్తున్న సమయంలో పాఠశాలలో మొత్తం నాలుగు వందల మంది విద్యార్ధులున్నట్లు ఉపాధ్యాయులు చెప్పారు. అయితే హాజరైంది మాత్రం మూడు వందల యాభై మంది మాత్రమే. ఒకే రోజు యాభై మందికి పైగా విద్యార్దులు అబ్సెంట్ అవ్వడంపై ప్రధానోపాధ్యాయుడిని కలెక్టర్ నిలదీశారు. వర్షం కారణంగా విద్యార్ధుల హాజరు శాతం తగ్గిందని చెప్పడంతో కలెక్టర్ మరింత అవాక్కయ్యారు.

విద్యార్దుల హాజరు తర్వాత ఉపాధ్యాయుల సంగతి ఏంటని ఆరా తీశారు. అయితే ముప్పై మంది టీచర్లు స్కూల్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. నాలుగు వందల మంది విద్యార్ధులకు ముప్పై మందా అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెయ్యి మంది విద్యార్ధులుంటున్న బడుల్లో కూడా ముప్పై మంది టీచర్లే ఉండటాన్ని చూస్తున్నాం. మరి మీ దగ్గర అంత తక్కువ సంఖ్యలో విద్యార్ధులుండటానికి కారణమేంటని నిలదీశారు. అంతేకాదు విద్యార్ధుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న చర్యలేంటని అడిగారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు సమాధానం చెప్పలేకపోయారు.

Collector Visit to ZP High School ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులు ఉండటం లేదన్న ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. కొన్ని చోట్ల ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువుగా ఉంటే మరికొన్ని చోట్ల తక్కువుగా ఉంటున్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరిపి విద్యార్దులు ఉపాధ్యాయులు శాతం సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక అసలు వాస్తవాలపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this