Andhra PradeshWe want OPS ఒపిఎస్‌ తప్ప మరే...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

We want OPS ఒపిఎస్‌ తప్ప మరే పెన్షన్‌ పథకం వద్దు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

We want OPS కేంద్ర ప్రభుత్వం సిపిఎస్‌ స్థానంలో (యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం) యుపిఎస్‌ అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అదనంగా వనగూరే ప్రయోజనం ఏమీ లేదని, కావున పాత పెన్షన్‌ విధానమే అమలు చేయాలని, వేరొక దాన్ని అంగీకరించేది లేదని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

we want ops
august 19, 2026, 7:48 pm - duniya360

We want OPS

ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో జరిగిన యుటిఎఫ్‌ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన జిల్లా స్వర్ణోత్సవాలకు సంబంధించి తన గోడ పత్రికను ఉపాధ్యాయ సంఘాలకు నాయకులతో కలిసి విడుదల చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగి ఎలాంటి కంట్రిబ్యూషన్‌ చెల్లించకుండా ఇచ్చే పాత పెన్షన్‌ను పునరుద్ధరించకుండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి ప్రయత్నించిన జిపిఎస్‌ లాంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందన్నారు.

ఈ విధానంలో కన్యుకేషన్‌ పెరిగిన పిఆర్‌సిలు, డిఎ విషయాలు లేవని తెలిపారు. 10 శాతం ఉద్యోగుల నుంచి కట్టించుకునే సొమ్ము షేర్‌ మార్కెట్లో పెట్టడం వల్ల ఉద్యోగులకు ఉపయోగం కాదని తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌.మురళీమోహనరావు, ఎస్‌.కిషోర్‌ కుమార్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యారంగా సంస్కరణ వల్ల ప్రభుత్వ విద్యారంగం విచ్ఛిన్నమై విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు.

పని సర్దుబాటు అవసరం మేరకు చేస్తామని చెప్పి ఇప్పుడు గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. అలాగే అక్టోబర్‌ 20, 21 తేదీల్లో జరిగే జిల్లా స్వర్ణోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎ.భాస్కరరావు, సహాధ్యక్షులు వి.జ్యోతి, కోశాధికారి కె.మురళి, రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.మోహన్‌రావు పాల్గొన్నారు.

పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి : ఎపిటిఎఫ్‌కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం పేరుతో ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్‌ పథకం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలో ప్రకటించిన గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ వంటిదేనని, సర్వీసు వ్యవధితో సంబంధం లేకుండా అందరికీ పాత పెన్షన్‌ వర్తింపజేయడమే న్యాయ సమ్మతమని ఎపిటిఎఫ్‌ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్‌, బాలకష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీముకు మరో రూపమే తప్ప పాత పెన్షన్‌ విధానం కాదన్నారు. సిపిఎస్‌ వలే ఉద్యోగి జీతంలో నుండి 10శాతం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్‌ 1 నుండి అమల్లోకి రానున్న కొత్త పెన్షన్స్‌ పథకాన్ని ఎపిటిఎఫ్‌ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఉద్యోగులకు ప్రతికూలమైన ఈ పథకాన్ని తిరస్కరిస్తూ పాత పెన్షన్‌ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this