న్యూఢిల్లీ : భారత్లో వృద్ధుల జనాభా 2050నాటికి రెట్టింపు కావచ్చని అంచనా వేస్తున్నట్లు యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాప్యులేషన్ యాక్టివిటీస్ (యుఎన్ఎఫ్పిఎ) తెలిపింది. దీంతో ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణం మరియు పెన్షన్లకు అధిక పెట్టుబడి అవసరమని సూచించింది. ముఖ్యంగా ఒంటరిగా నివసించే మరియు పేదరికాన్ని ఎదుర్కొనే మహిళలకు అత్యవసరమని హెచ్చరించింది.
2050 నాటికి 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తుల సంఖ్య 346 మిలియన్లకు రెట్టింపు కావచ్చని యుఎన్ఎఫ్పిఎ ఇండియా చీఫ్ ఆండ్రియా వోజ్నార్ పేర్కొన్నారు. అదేవిధంగా 10 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 252 మిలియన్ల యువజనాభా ఉంటుందని పేర్కొన్నారు. అంటే భారత్లో యువజనాభా గణనీయంగా ఉంటుందని అన్నారు.ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం, విద్య, ఉద్యోగ శిక్షణ మరియు ఉద్యోగ కల్పనలో పెట్టుబడి పెట్టడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు జనాభా సామర్థ్యాన్ని విస్తృతం చేస్తూ, దేశాన్ని పురోగతి వైపు నడిపించవచ్చని అన్నారు.
Source: Praja Sakti
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి [email protected] కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.