Friday, May 30, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Andhra PradeshCPI Ramakrishna: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.....

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

CPI Ramakrishna: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. రైల్వే జోన్ పనులు ప్రారంభించాలి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

CPI Ramakrishna: ఏపీని దగా చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే అని ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.. మరోవైపు.. శాంతిభధ్రతలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించాలని సూచించారు.. వర్షాలతో రాష్ట్రం మొత్తం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్దితిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఉన్న ఇంటి దగ్గరకు దాడికి వెళ్ళటం సరైన పద్దతి కాదన్నారు రామకృష్ణ.. గతంలో వైసీపీ ఇదే తరహా దాడులకు పాల్పడిందని విమర్శించిన ఆయన.. చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇలాంటి దాడులు సరైనది కాదు అని హితవుపలికారు. ఒక ఎంపీనే ఊర్లోకి రానివ్వం అంటూ ఆయనపైనే కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.. సీఎం చంద్రబాబు వీటిని సరిదిద్దాలి.. పోలీసులు గతంలో చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం.. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి సాయం అందించాలని కోరారు. ప్రభుత్వం రైతులకు హామినిచ్చిన విధంగా రైతుభరోసా నిధులు వెంటనే అందించాలి.. సీఎం చంద్రబాబు కేంద్రం చెప్పిన విధంగా ఈసారైనా విభజన హామీలను అమలు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this