Saturday, June 21, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Andhra Pradeshనిన్న లక్షలు, నేడు కోట్లు… పిఠాపురంలో భూముల...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

నిన్న లక్షలు, నేడు కోట్లు… పిఠాపురంలో భూముల ధరలకు రెక్కలు.. నెల రోజుల్లోనే ఎందుకింత మార్పు? కారణం ఏంటి?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gossip Garage : ఆ నియోజకవర్గం రాష్ట్ర రాజధానికి దగ్గర లేదు.. రాష్ట్రంలో ప్రధాన నగరాలకు సమీపంలో కూడా లేదు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కాదు. ఏవో అంతర్జాతీయ సంస్థలు వస్తాయనే ప్రచారమూ లేదు. పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న ఆ నియోజకవర్గం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద ఏపీ. ఆ నియోజకవర్గంలో భూములకు ఒక్కసారి గిరాకీ పెరిగింది. ఎన్నికల ముందు వరకు ఉన్న ధరలు ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయాయి. ఎక్కడెక్కడి వారో అక్కడ భూముల కోసం ఎగబడుతున్నారు… ఇంతలా ఆ నియోజకవర్గంలో భూములకు డిమాండ్‌ ఎందుకు ఏర్పడింది? ఇంతలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది…

నెల రోజులుగా రియల్ భూమ్.. చుక్కలను తాకుతున్న భూముల ధరలు..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో పరిస్థితులు మారుతున్నాయా? గత ఐదేళ్లు నత్తనడకన సాగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటున్నాయా….? ఈ విషయాలు తెలుసుకోవాలంటే పిఠాపురం నియోజకవర్గంపై ఓ లుక్కేయాల్సిందే… రాష్ట్రంలో రియల్‌ వ్యాపారం ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే, పిఠాపురంలో మాత్రం భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత నెల రోజుల నుంచి పిఠాపురంలో రియల్‌ భూమ్‌తో పంట పొలాల ధరలు ఒక్కసారిగా రెండింతలయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంపై రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్‌ ఉండటం…. పిఠాపురం రూపురేఖలు మార్చేస్తారనే అంచనాలతో ఈ నియోజకవర్గంలో భూములపై పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు.

రెండు నుంచి మూడు రెట్లు పెరిగిన భూముల ధరలు..
గత నెల రోజులుగా పిఠాపురంలో భూ వ్యవహారాలను గమనిస్తే ఎన్నో ఆసక్తికర విశేషాలు తెలుస్తున్నాయి. ఒకప్పుడు 50 నుంచి 60 లక్షల రూపాయల ఉండే భూములు ధరలు ఇప్పుడు రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయి. ఇలా ఒకేసారి ధరలు పెరగడానికి కారణం డిప్యూటీ సీఎం పవన్‌ కారణమని విశ్లేషిస్తున్నారు రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు. గతంలో తమ ప్రాంతంలో ఈ స్థాయిలో రియల్‌ వ్యాపారం జరిగేది కాదని… పవన్‌ గెలిచిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో స్థిరపడిన వారు సైతం భూముల కోసం తమకు ఫోన్లు చేస్తున్నారని చెబుతున్నారు.

పిఠాపురంలో భూములున్న వారి పంట పండుతోంది..
గత నెల రోజులుగా మారిన పరిస్థితులతో పిఠాపురంలో భూములు ఉన్నవారి పంట పండుతోంది. రోజు రోజుకు ధరలు పెరిగిపోవడంతో అమ్ముదామని అనుకున్నవారు సైతం కొద్ది రోజులు వేచిచూద్దామనే ఆలోచనకు వచ్చేస్తున్నారు… ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంలో సొంత ఇల్లు, పార్టీ ఆఫీసు నిర్మాణానికి 3.52 ఎకరాలు భూమి కొన్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. రెండు ఎకరాల్లో పార్టీ ఆఫీసు, ఆ పక్కనే తన సొంత ఇల్లు నిర్మిస్తానని ప్రకటించారు. ఇక ఆ మరునాడు నుంచి పవన్‌ భూమికొన్న పరిసరాల్లో స్థలాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో తరలివస్తున్న రియల్‌ వ్యాపారులు… బేరాలు కూడా లేకుండా రైతులు చెప్పిన ధరకు అగ్రిమెంట్లు చేసుకుంటామని ఆఫర్లు ఇస్తున్నారు…

ఎకరం ధర రూ.2 కోట్లు..
తాజా రియల్‌ భూమ్‌తో పిఠాపురం టౌన్‌లో రోడ్డు పక్కన ఎకరం 2 కోట్లు పలుకుతోంది. ఇంతకుముందు వరకు 50 లక్షల నుంచి కోటి 25 లక్షల రూపాయల మధ్య ఉండే ధర అమాంతంగా పెరగడంపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే ఎకరం భూమి అమ్మాల్సి వచ్చేదని… ఇప్పుడు సగం భూమి అమ్మినా గ్రాండ్‌గా పెళ్లి చేసేయొచ్చని సంబరపడుతున్నారు పిఠాపురం వాసులు. పవన్‌ నాయకత్వంపై నమ్మకం వల్ల భవిష్యత్‌లో పిఠాపురం అభివృద్ధి చెందే అవకాశం ఉందనే ఆలోచనే ఈ రియల్‌ భూమ్‌కి కారణంగా చెబుతున్నారు. ఒక్కసారిగా ఏర్పడిన డిమాండ్‌తో పిఠాపురం నుంచి చేబ్రోలు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా కొందామంటే భూములు దొరకని పరిస్థితి ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. మొత్తానికి పవన్‌ నాయకత్వంపై నమ్మకంతో పిఠాపురంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుండటమే హాట్‌టాపిక్‌గా మారింది.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this