ATM Withdrawal Charges: అలర్ట్.. భారీగా పెరగనున్న...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

ATM Withdrawal Charges: అలర్ట్.. భారీగా పెరగనున్న క్యాష్​ విత్​డ్రా ఛార్జీలు​..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.23కు పెంచాలని నిర్ణయం
  •  ఉచిత లావాదేవీలను మించి చేస్తే బాదుడే
  •  ఏటీఎం ఛార్జీలు పెంచడానికి చర్చలు జరుగుతున్నాయి
atm withdrawal charges: అలర్ట్.. భారీగా పెరగనున్న క్యాష్​ విత్​డ్రా ఛార్జీలు​..

పరిమితికి మించి ఏటీఎం లావాదేవీల కోసం కస్టమర్లకు వసూలు చేసే రుసుములు పెరిగే అవకాశం ఉంది. దేశంలోని ఎటిఎం ఆపరేటర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని నగదు ఉపసంహరణ కోసం కస్టమర్లు చెల్లించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని కోరారు. నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) కంపెనీ ఎక్కువ డబ్బును సంపాదించడానికి ప్రతి లావాదేవీకి ఇంటర్‌చేంజ్ ఫీజును గరిష్టంగా రూ.23కి పెంచాలని భావిస్తోంది. ఈ విషయం పై ఎజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాన్లీ జాన్సన్ మాట్లాడుతూ., చివరిసారిగా ఇంటర్‌ఛేంజ్ ఫీజుల పెరుగుదల రెండేళ్ల క్రితం జరిగింది. అలాగే స్లాన్సీ జాన్సన్ మాట్లాడుతూ.. “మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాము. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు చెల్లించే రుసుమును పెంచాలన్న మా అభ్యర్థనపై ఆర్‌బీఐ సానుకూలంగా స్పందించింది. CATMI ఈ రుసుమును రూ. 21 పెంచాలని ప్రతిపాదించగా, మరికొందరు ATM ఆపరేటర్లు దీనిని రూ. 23కి పెంచాలని కోరుకున్నారు. ఇంటర్‌చేంజ్ ఫీజులు పెరిగి చాలా సంవత్సరాలు అయ్యిందని చెప్పారు.

ఏటీఎంలలో రుసుములను పెంచడంపై ఇప్పుడు చాలా చర్చ జరుగుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. కమీషన్లు పెంచేందుకు ఈ బృందం బ్యాంకులతో మాట్లాడుతోంది. బ్యాంకులు కూడా కమీషన్ పెంచడానికి అంగీకరించాయి. ఈ విషయాన్ని ఏటీఎం తయారీదారి యాజమాన్యాలు తెలిపారు. ఇదిలా ఉండగా ఇంటర్‌బ్యాంక్ ఏటీఎం లావాదేవీల రుసుమును 2021లో రూ.15 నుంచి రూ.17కు పెంచారు. ఇక ఆపరేటర్ల అభ్యర్థన మేరకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది రూ.23కి చేరుతుంది.

మీరు పరిమితిని మించి ఉంటే., ఎటిఎం రుసుము వసూలు చేయబడుతుంది. సాధారణంగా, ఒక వ్యక్తి ఎటిఎం నుండి నెలకు ఐదు సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ వంటి 6 ప్రధాన నగరాల్లో, బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఇతర బ్యాంకుల ఎటిఎంలు నెలకు మూడు ఉచిత లావాదేవీలను అందిస్తాయి. ఈ పరిమితి దాటితే రుసుము వసూలు చేయబడుతుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this