Thursday, May 29, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Analysis B.Ed Vs D.Ed సుప్రీంకోర్టు చారిత్రాత్మక...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

Analysis B.Ed Vs D.Ed సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు : నాణ్యత లేని ప్రాథమిక విద్య… విద్యార్థుల ప్రాథమిక హక్కును హరిస్తుంది !

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

11/08/2023 న సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు :: నాణ్యమైన ఉపాధ్యాయులు  లేకుండా , నాణ్యమైన ప్రాథమిక విద్య అందదు . 

( దేవేష్ శర్మ vs యూనియన్ ఆఫ్ ఇండియా , సివిల్ అప్పీల్ నంబర్ – 5068 of 2023).

analysis b.ed vs d.ed సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు :  నాణ్యత లేని  ప్రాథమిక విద్య...  విద్యార్థుల ప్రాథమిక హక్కును హరిస్తుంది !


*****************************

చరిత్ర:- 

గురువులకే గురువు అయిన గోపాలకృష్ణ గోఖలే ,  జాతి పిత మహాత్మా గాంధీలు కలలు కన్నట్లుగా భారత రాజ్యాంగంలో ప్రాథమిక విద్య ” నిర్బంధం చేయబడలేదు , మరియు అది కనీసం ప్రాథమిక హక్కు గా కూడా పరిగణించబడలేదు.”. ఈ లోపాన్ని సుప్రీమ్ కోర్టు వివిధ తీర్పుల ద్వారా సరిచేసి …  పాఠశాల  విద్య పౌరుల ‘ ప్రాథమిక హక్కుగా ‘ నెలకొల్పింది . తదుపరి వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు , కేంద్ర ప్రభుత్వం 2002 లో 86 వ భారత రాజ్యాంగ సవరణ చేసి , 6 నుండి 14 సంవత్సరాల వారికి ప్రాథమిక విద్యను, ఒక ప్రాథమిక హక్కు గా  ఆర్టికల్ 21 A కింద చేర్చింది.

తదుపరి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు , రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన ప్రాథమిక హక్కును … అమలు పరచడం కోసం  ”విద్యా హక్కు చట్టం -2009′  తీసుకువచ్చారు. 

విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చాక బడుల సంఖ్య పెరిగింది , కొన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి…. కానీ నాణ్యమైన విద్య అందడం  అనేది ఒక కలగానే మిగిలిపోయింది. ఇందుకు ఒక ప్రధాన కారణం ‘ బాధ్యతాయుతం గా పాఠాలు చెప్పే … సరైన శిక్షణ కలిగిన నాణ్యమైన ఉపాధ్యాయులు లేకపోవటం ”. 

****************************

ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనే రోజులు పోయి ,  ‘ ఇప్పుడు ఉపాధ్యాయుల జీతాలు వేలల్లో, లక్షల్లో ఉన్నాయి ‘. ఒకప్పుడు 7 వ తరగతి పాస్ అయిన వారికి రెండు సంవత్సరాలు ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చి … వారినే సర్వీస్ లోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది…  డిగ్రీ లు , పీజీ లు చేసిన వారు మాత్రమే ఉన్నారు ( 96% పైగా) . టీచర్లకు అయితే డిగ్రీలు ఉన్నాయి  … కానీ వారి బోధనలో నాణ్యత లేదు… కారణం  వారికి సరైన శిక్షణ లేదు.

 M. Sc. , M.Ed చేసిన వారు 1 , 2 తరగతుల పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు . అంటే అక్షరాలు , పదాలు ,  వాక్యాలు, కూడికలు , తీసివేతలు నేర్పాలి… చిన్న చిన్న కథలు చెప్పాలి , పాటలు నేర్పాలి..  ఎటువంటి శిక్షణ లేకుండా ఇవి     M.Sc , M.Ed లు ;  B. Sc. , B.Ed లు  చేయగలరా ? 

*****************************

బడితె ఉన్నవాడిదే బర్రె! – నోరు ఉన్నవాళ్లు చెప్పిందే ప్రభుత్వాల విద్యా విధానం :

నిజానికి ఈ దేశంలో ఉపాధ్యాయుల శిక్షణ పై  చెప్పుకోదగ్గరీతిలో , సరైన దిశగా   చర్చ జరగలేదు. 

ప్రాథమిక విద్యా బోధన చేసే ఉపాధ్యాయుల కోసం D.Ed  , మాధ్యమిక విద్యా బోధన చేసే ఉపాధ్యాయుల కోసం B.Ed  కోర్సులు ఉన్నాయి…. వీరి ప్రాక్టికల్స్ శిక్షణ కూడా ఆయా కోర్సులకు తగినట్లుగానే ఉంటుంది. 

కానీ దురదృష్టవశాత్తు ప్రైవేట్ కాలేజ్ ల లాబీయింగ్ , బీ.ఎడ్ చదివిన విద్యార్థులు రాష్ట్రాలలో ఎక్కువగా ఉండటం వలన … వారు రాజకీయ పార్టీల పై ఒత్తిడి తెచ్చి ….నిబంధనలు మార్పించుకొని  ” తమకు ఎటువంటి శిక్షణ , నైపుణ్యం లేని…  ప్రాథమిక విధ్యార్ధులకు పాఠాలు బోధించే టీచర్లు గా నియమితుల్యారు “. ఇది ఎలాంటిదంటే ‘ జనరల్ మెడిసిన్ చదివిన డాక్టర్ … పిల్లల వైద్యుడి గా ఆసుపత్రిలో ఉద్యోగంలో  చేరడం  లాంటిది . ‘.

******************************

సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పిన అంశం ఏమిటంటేప్రాథమిక స్థాయి విద్యార్థులకు బోధించడానికి ప్రత్యేక శిక్షణ అవసరం. ఆ శిక్షణ ( కోర్సు ) తీసుకున్నవారే అనగా D.Ed వారినే  ప్రాథమిక టీచర్లు గా నియమించాలని , B.Ed వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం వారిని ప్రాథమిక టీచర్లు గా అర్హత ఇవ్వడం అనే నిర్ణయం  ….  ప్రాథమిక స్థాయి విద్యార్థుల యొక్క బోధనావసరాలను ( learning necessities )  ,  భవిష్యత్తును ,  శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొని చేసింది కాదు అని. 

*****************************

మేధావుల , రాజకీయ పార్టీ ల మౌనం :-

దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో నాణ్యత లేని  పాఠశాల విద్య గురించి మేధావులు , రాజకీయ పార్టీలు మౌనం వహించడం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ‘ 4 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులలో 10 లక్షల పైచిలుకు మందికి తెలుగు లో 3 సరళ  ( చాలా తేలికైన ) వాక్యాలు ఉన్న పేరా ను తప్పులు లేకుండా చదవలేరు . 17 లక్షల పై చిలుకు మందికి ‘ i like this book , this is my house ‘ లాంటి ఇంగ్లీష్ వాక్యాలు చదవడం రాదు. ( Ref :- బేస్ లైన్ పరీక్ష , 2022 ) 

విద్యార్థుల ప్రమాణాలు ఇంత ఘోరంగా ఉన్నా కూడా ‘ మేధావులు, రాజకీయ పార్టీ లు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం… బాధ్యతారాహిత్యమే . ఎందుకంటే విద్య సామాజిక , ఆర్థిక , రాజకీయ , సాంఘిక మార్పులకు దారితీస్తుందని…. తద్వారా సమానత్వం సాధించగలమని నమ్ముతున్నామో….  ఆ మార్పులు రావాలంటే కనీసం పిల్లలకు చదవడం , రాయడం రావాలి. అవి లేకుండా విద్య వలన ఏ విధమైన మార్పులు రావు. 

*****************************

 అసలు ప్రశ్న:: 

 భాషకు లిపి వచ్చినప్పటినుండి పిల్లలకు వారి వారి మాతృభాషలో చదవడం , రాయడం , మరియు చిన్నపాటి లెక్కలు అనే ప్రక్రియలు నేర్పడం అనేది అనాదిగా ప్రతీ సమాజం అమలు  పరిచిన విధానం. రాజులు మారినా , మతాలు మారినా , పరిపాలన విధానాలు మారినా ,  ఇంకా ఇతర విషయాలలో మార్పు వచ్చినా సరే … భారత దేశంలోని ప్రతీ గ్రామంలో , ప్రతీ పట్టణంలో ఈ బోధనా ప్రక్రియ కొనసాగింది. బ్రిటిష్ వాళ్ళు రాకముందే అన్ని వర్ణాలకు ,   అన్ని వర్గాలకు వీధి బళ్ళలో ప్రాథమిక విద్య ను బోధించారు. పిల్లల తెలివి తేటలమేర ఈ ప్రాథమిక విద్య రెండు నుండి నాలుగు సంవత్సరాలు జరిగేది. ఈ సమయంలో వారికి చదవడం , వ్రాయడం , సాధారణ గణితం నేర్పేవారు.  బ్రిటిష్ వారు రాక ముందు భారత దేశంలో విద్య ఎలా ఉంది అన్న విషయం పై … మద్రాసు ప్రావిన్స్ లోని అప్పటి బ్రిటిష్ కలెక్టర్లు వ్రాసిన రిపోర్టులను క్రోడీకరించిన  బ్రిటిష్ గవర్నర్ జర్నల్  థామస్ మన్రో ,  1820 లలో పూర్తి రిపోర్ట్ లో  వ్రాశారు. అందులో పైన తెలిపిన అంశాలు మతాల ,  వర్ణాల వారీ గా బడిలో ఉన్న మగ పిల్లల గణాంకాలు ఉన్నాయి. ( Ref -:- the beautiful tree : indigenous Indian education in 18th century ).

స్వాతంత్రోద్యమ కాలంనుండి ….  1980 ల ముందు వరకు కూడా చాలా  ప్రాథమిక బడులు పూరిపాకల్లో , రేకుల షెడ్ల లలో ఉండేవి. అయినా పిల్లలకు చదవడం , రాయడం చక్కగా నేర్పారు. 

వేల సంవత్సరాలుగా వీధి వీధినా..  వీధి బళ్లలో చక్కగా నడిచిన ఈ బోధనా ప్రక్రియ , గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇంత లోపభూయిష్టంగా తయారయ్యింది ?  రోజూ బడికి  వెళ్ళే లక్షలాది మంది పిల్లలకు కనీసం చదవడం , రాయడం ఎందుకు నేర్పలేక పోతున్నాము ?? అన్న ప్రశ్నకు  నిజాయితీ గా పరిష్కారం వెతకాలి. లేనియెడల జాతి భవిష్యత్తు అంధకారమవుతుంది. 

ఇట్లు ,

డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్. 

14/08/2023.

For Supreme Court Judgement Copy Click Here

https://news.google.com/publications/caaqbwgkmjfgrgswpovgaw?hl=en-in&gl=in&ceid=in:en

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this