NMMS 2023 : Due Date Extended...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

NMMS 2023 : Due Date Extended Upto 15.11.2022 – Press note and Instructions on Eligibility

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
nmms 2023 : due date extended upto 15.11.2022 - press note and instructions on eligibility

పత్రికా ప్రకటన

2023 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ. లో, 15-11-2022 వరకు పొడిగించడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచూ, తల్లి తండ్రుల సంవత్సరాదాయం 3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు అందరూ ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుచున్న విద్యార్ధులు ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులు కాదు. ఈ పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్ సైటు www.bse.ap.gov.in నందు NMMS ట్యాబ్ లో గల “NMMS Online Application Receiving-2022” అనే లింకును ఓపెన్ చేసి సంబంధిత స్కూల్ U-DISE కోడ్ ను నమోదు చేయవలెను. కుల, ఆదాయ మొదలగు ధృవ పత్రములు లేని విద్యార్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనవచ్చును, గాని 2023 ఫిబ్రవరి మొదటి వారమునకు అన్ని ధృవపత్రములు తప్పనిసరిగా సిద్ధం చేసుకొనవలెను. పరీక్ష రుసుము ఓ.సీ, బీ.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి. యస్.టి విద్యార్థులకు రూ.50/- నామినల్ రోల్ మరియు SBI Collect ఒరిజినల్ రశీదును సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో 19-11-2022 లోపు సమర్పించవలెను. ఈ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్ధులకు 9, 10, 11, 12 తరగతులకు విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి నియమ నిబంధనలను అనుసరించి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు విద్యా మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారి ద్వారా నేరుగా విద్యార్ధి బ్యాంక్ ఖాతాలో జమచేయబడును. ఎంపిక అయిన ప్రతి విద్యార్థి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో ఆధార్ వివరములు నమోదు చేయవలసి ఉన్న కారణమున ఈ సంవత్సరం నుండి విద్యార్థి వివరములు ఆధార్ లో ఉన్న ప్రకారంగా నమోదు చేయవలెను. మరిన్ని వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గానీ సంప్రదించవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు. తెలియజేసారు.

Download Letter to DEO’s


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this