Tuesday, July 15, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టుకు...

AP Mega DSC 2025 తుది కీ జూలై 25న విడుదల! అభ్యర్థులకు పూర్తి వివరాలు ఇక్కడ!

AP Mega DSC 2025 అభ్యర్థులకు గుడ్ న్యూస్! జూలై 25న...

BRAOU Admissions 2025 ప్రారంభం! UG, PG, డిప్లొమా & సర్టిఫికేట్ కోర్సులకు ఇప్పుడే అప్లై చేయండి!

హైదరాబాద్ లోని ప్రసిద్ధ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU Admissions 2025)...

AP ప్రభుత్వ ఉద్యోగులకు SBI SGSP package తో అద్భుతమైన లాభాలు మరియు సురక్షితమైన ఫైనాన్షియల్ ఫీచర్స్!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అనేక సౌకర్యాలు ఉన్నాయి, కానీ...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు స్టార్ట్‌ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఇవాళ్టి నుంచి జూన్‌ 10వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు

Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..!

Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు స్టార్ట్‌ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఇవాళ్టి నుంచి జూన్‌ 10వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్‌ 13న ప్రారంభం కానున్నాయి. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఆదేశాలతో, సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు, వెకేషన్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి. వెకేషన్‌ కోర్టుల్లో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్‌ పిటిషన్లు, సెలవులు పూర్తయ్యేంత వరకు వేచి చూడలేని అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాలని స్పష్టం చేసింది హైకోర్టు. మొదటి దశ వెకేషన్‌ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ కె.మన్మథరావు, జస్టిస్‌ తర్లాడ రాజశేఖర్, జస్టిస్‌ చీమలపాటి రవి ఉండనున్నారు. ఇందులో జస్టిస్‌ మన్మథరావు, జస్టిస్‌ రాజశేఖర్‌ ధర్మాసనంలో, జస్టిస్‌ చీమలపాటి రవి సింగిల్‌ జడ్జిగా కేసులను విచారిస్తారు. రెండో వెకేషన్‌ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉంటారు. వీరిలో జస్టిస్‌ దుర్గా ప్రసాదరావు, జస్టిస్‌ కృష్ణమోహన్‌లు ధర్మాసనంలో, జస్టిస్‌ వెంకటేశ్వర్లు సింగిల్‌ జడ్జిగా కేసులను విచారిస్తారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఏవీ రవీంద్రబాబు ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. వ్యాజ్యాలు వేయాలనుకునేవారు, ఈ విషయాన్ని గమనించాలని సూచించారు రిజిస్ట్రార్. జూన్‌ 13 నుంచి మళ్లీ యథావిధిగా కోర్టు కార్యకలాపాలు జరగనున్నాయి.

andhra pradesh high court: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..!

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this