Tuesday, October 14, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదంపై కేంద్రం...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదంపై కేంద్రం సీరియస్.. కంపెనీలకు వార్నింగ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Electric Vehicle Accidents: ఏదైనా కంపెనీ తమ ప్రక్రియలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానా విధించబడుతుందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు.

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదంపై కేంద్రం సీరియస్.. కంపెనీలకు వార్నింగ్

గత రెండు నెలలుగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన అనేక సంఘటనలు చోటుచేసుకోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రమాదాలపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. ఒకవేళ ఈ విచారణలో కంపెనీల లోపాలు ఉన్నట్టు తేలితే భారీ జరిమానాలు, ఇతర చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు(Electric Vehicles) సంబంధించిన అనేక ప్రమాదాలు వెలుగులోకి రావడం.. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడటం అత్యంత దురదృష్టకరమని గడ్కరీ అన్నారు.
ఈ సంఘటనలపై విచారణ, నివారణ చర్యలపై సిఫార్సులు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఓలా ఇ-స్కూటర్(Ola Electric Scooter) మంటల్లో చిక్కుకున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. స్టార్టప్ ప్యూర్ ఈవీకి చెందిన స్కూటర్ కూడా మంటల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగించింది. ఒకినావా ఆటోటెక్ ప్రైవేట్ బైక్ దగ్ధమై ఇద్దరు వ్యక్తులు మరణించారు.
ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. నివేదికల ఆధారంగా తాము డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం నాణ్యత, ఇతర అంశాలపై మార్గదర్శకాలను జారీ చేస్తామని తెలిపారు. ఏదైనా కంపెనీ తమ ప్రక్రియలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానా విధించబడుతుందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు.
లోపాలు ఉన్న అన్ని వాహనాలను రీకాల్ చేయడానికి ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఈ విష‌యంలో కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి గడ్కరీ కంపెనీలను కోరారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌ బైక్‌లలో 2 శాతం అమ్మకాల స్థాయి నుంచి 2030 నాటికి మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 80 శాతానికి చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను స్థానికంగా తయారు చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందిస్తోంది.

electric vehicles: ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదంపై కేంద్రం సీరియస్.. కంపెనీలకు వార్నింగ్


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this