Friday, May 16, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
PRC Issue : ఉద్యోగులు లేకపోతే నేను...

AP Teacher Transfers 2025: ఇప్పుడే చూడండి! Live Updates

AP Teacher Transfers 2025: ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు!...

Ten Hours Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. ఇది ఇప్పుడు టాప్-3లో!

Ten Hours Movie: తక్కువ బడ్జెట్‌తో ఓటీటీలో సెన్సేషన్! CB సత్యరాజ్...

AP Teacher Transfers: ఉపాధ్యాయుల బదిలీలకు నేడే షెడ్యూల్ విడుదల !?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ను నేడు ప్రకటించే అవకాశం....

AP Polycet 2025 Results Out Now! ఇక్కడ చెక్ చేసుకోండి Official Link ద్వారా!

AP Polycet 2025 Results ఈరోజు (14th May 2025) అధికారికంగా...

PRC Issue : ఉద్యోగులు లేకపోతే నేను లేను.. వారికి మంచి జరిగేలా చేస్తున్నాం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 AP CM JAGAN On PRC Issue : ఉద్యోగులు లేకపోతే తాను లేనని, వారికి మంచి జరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం జగన్. రిటైర్ అయిన తర్వాత కూడా వారికి మంచి జరిగేలా అడుగులు వేస్తున్నామని, ఐఆర్ ఇచ్చిన 30 నెలల కాలానికి, 9 నెలల ఐఆర్ ను సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ. 5 వేల 400 కోట్ల భారం పడుతందన్నారు. రికరింగ్ వ్యయం రూపేణ హెచ్ఆర్ఏ వల్ల రూ. 800 కోట్లు, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్, సీసీఏ రూపంలో రూ. 1330 కోట్లు.. కొత్త పీఆర్సీ వల్ల రూ. 11 వేల 500 కోట్ల భారం పడుతుందన్నారు. 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం ఉదయం ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. హెచ్ఆర్ఏ రూపంలో అదనంగా మరో రూ. 325 కోట్ల భారం పడుతుందన్నారు.

ఆర్థిక పరిస్థితులు బాగుంటే ఉద్యోగులకు మలరింత మంచి చేసేవాడినని, అర్థం చేసుకుని సహకరించినందుకు ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాన్నారు. రాబోయే రోజుల్లో సీపీఎస్ మీద గట్టిగా పని చేయడం జరుగుతుందన్నారు. భావోద్వేగాలకు తావివ్వవద్దని, సమస్యలుంటే చెప్పాలని వారికి సూచించారు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందని, ఏ సమస్య ఉన్నా వారితో చెప్పుకోవచ్చన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నామన్నారు. అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దామన్నారు. పీఆర్సీ విషయంలో మంచి ఆలోచన వచ్చిందని, ఎక్కడా ఉద్యోగులు డిమాండ్ చేయలేదన్నారు. వారికి మేలు జరిగేలా చేస్తున్నట్లు, ఉద్యోగుల సహకారంతో మంచి పనులు చేయగలుగుతున్నామన్నారు సీఎం జగన్.

ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పడింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు సఫలం అయిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి ఉద్యోగ సంఘాలు. ఈనెల 7నుంచి సమ్మె నిర్వహిస్తామన్న ఉద్యోగులు… ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులంతా విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘం నేతలు. అంతేకాదు… 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

prc issue : ఉద్యోగులు లేకపోతే నేను లేను.. వారికి మంచి జరిగేలా చేస్తున్నాం

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this