Holidays Extension: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తోంది. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా ప్రభావం ముందుగా విద్యాసంస్థలపై పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు ఈనెల 30 వరకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదట విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు ఉండగా, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈనెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వైపు కోవిడ్ కేసులు.. మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాతో కేసులు తీవ్రతరం అవుతున్న దృష్ట్యా విద్యార్థులకు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశం సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
It has been decided to extend the vacation of all educational institutions in Telangana till 30.1.2022.@SomeshKumarIAS,
Chief Secretary,
Telangana State.— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) January 16, 2022