MMTS: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. పెరిగిన...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

MMTS: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. పెరిగిన ఎంఎంటీఎస్‌ సర్వీసులు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 MMTS: హైదరాబాదీలకు ఎంతగానో ఉపయోగపడే వాటిలో ఆర్టీసీ బస్సుల తర్వాత ఎంఎంటీఎస్‌లదే స్థానం. ఇంకా చెప్పాలంటే ఆర్టీసీ కంటే తక్కువ ఖర్చు ఉండే ఈ ప్రయాణానికి పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగించుకుంటారు. అయితే కరోనా సమయంలో ఆగిపోయిన ఈ రైల్వే చాలా కాలం పాటు అలాగే ఆగిపోయాయి. అయితే తర్వాత ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్ల మేరకు తిరిగి సేవలను ప్రారంభించారు.

అయితే వీటిని కొన్ని సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ మరిన్ని సర్వీసులను పెంచారు. పెంచిన ఈ సర్వీసులు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా లింగంపల్లి-ఫలక్‌నుమా, హైదరాబాద్‌-లింగంపల్లి, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ మధ్య నడిచే రైళ్ల సంఖ్య 79కి చేరింది. ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు..

హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి..

ఉదయం 5 :40, 6 :40, 7 :55, 9 :00, 10 :00, 10 :55, 11 :35, మధ్యాహ్నం 12 :20, 1 :00, 2 :00, 3 :00, 3 :35, సాయంత్రం 4 :30, 5 :20, 6 :55, రాత్రి 7 :55, 10 :15 గంటలకు ఎంఎంటీఎస్‌లు బయలుదేరుతాయి.

లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా..

ఉదయం 5 :50, 6 :10, 6 :50, 8 :25, 90 :5, 10,05, 11 :20, 11 :40, మధ్యాహ్నం 12 :40, 1 :25, 2 :40, 3 :10, సాయంత్రం 4 :40 5 :10, 5 :30, 6 :00, 6 :35, 7 :55, రాత్రి 9 :00, 9 :15, 9 :45 గంటలకు ఎంఎటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు అదనంగా రాత్రి 10 :20, 11 :25 గంటలకు కూడా ఉన్నాయి.

ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి..

ఉదయం 4 :45, 6 :30, 7 :25, 8 :30, 8 :50, 10 :02, 11 :00, 11 :42, మధ్యాహ్నం 1 :00, 1 :30, 3 :00, 3 :50, 4 :15 గంటలకు, సాయంత్రం 5 :15, 6 :17, 7 :10,       7 :30 గంటలకు, రాత్రి 8 :00, 8 :40 11 :05, 11 :35 గంటలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి.

లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు..

ఉదయం 6 :40, 7 :40, 8 :10, 9 :15, 10 :15, 11 :10, 11 :55, మధ్యాహ్నం 12 :50, 1 :20, 2 :25, 3 :30, సాయంత్రం 4 :10, 5 :55, 6 :55, రాత్రి 8 :05, 9 :25 గంటలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి.

mmts: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. పెరిగిన ఎంఎంటీఎస్‌ సర్వీసులు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this