ఏపీ ఉద్యోగులకు అదిరే శుభవార్త: జీతాల పెంపుపై.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

ఏపీ ఉద్యోగులకు అదిరే శుభవార్త: జీతాల పెంపుపై.. రంగంలోకి జగన్ సర్కార్!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించే విషయం. పీఆర్సీ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు జగన్ సర్కారు ఆహ్వానం..!ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు ఊరట కలిగించే విషయం చెప్పింది. ఎప్పటి నుంచో నానుతూ వస్తున్న సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు వేసింది. పీఆర్సీ సహా సంబంధిత అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చించేందుకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ఇందుకోసం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరుకావాలని ఆర్థికశాఖ మానవ వనరుల విభాగం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ నుంచి పిలుపు వచ్చింది.
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సచివాలయం మొదటి బ్లాక్‌‌లోని సీఎం సమావేశ మందిరంలో కార్యదర్శుల కమిటీ సమావేశం జరుగుతుందని అందులో పేర్కొన్నారు. పీఆర్సీ నివేదికతో పాటు డీఏ బకాయిలు, సీపీఎస్‌ రద్దు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాల పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాల వంటి అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చించేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. డిసెంబర్ 10వ తేదీ లోపు పీఆర్సీపై ఓ స్పష్టత ఇస్తామంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటంతో ఆ దిశగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
మరో వైపు ఏపీ ఎన్జీవోల నేతృత్వంలోని ఏపీ జేఏసీ, రెవెన్యూ అసోసియేషన్‌ నేతృత్వంలోని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కూడా రెండు రోజుల క్రితం ఉద్యమ కార్యాచరణ నోటీసును సీఎస్‌కు ఇచ్చింది. డిసెంబరు 7వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు కార్యాచరణ రూపొందించుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పిలుపురావటంతో చర్చించాల్సిన అంశాలపై ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ప్రభుత్వం ముందు తమ వాదనలు బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఏపీ ఉద్యోగులకు అదిరే శుభవార్త: జీతాల పెంపుపై.. రంగంలోకి జగన్ సర్కార్!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this