AP Cyclone Warning: ఏపీ వైపు దూసుకొస్తున్న...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

AP Cyclone Warning: ఏపీ వైపు దూసుకొస్తున్న పెనుతుఫాన్.. ఈ జిల్లాలకు హై అలర్ట్.. ప్రభుత్వం అప్రమత్తం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ప్రకృతివైపరీత్యాలు వీడటం లేదు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదల (AP Floods) ధాటికి దక్షిణ కోస్తా, రాయమలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు పెనుముప్పు దూసుకొస్తోంది.

ఇదిలా ఉంటే ఏపీ తీరం వైపు పెనుముప్పు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలోని అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం.. గురువారం రాత్రికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి తుఫాన్ గా మారనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది డిసెంబరు 4 తేదీ నాటికి క్రమంగా ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా-ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశముంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సముద్ర నెలకొన్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఇది పెనుతుపానుగా రూపాంతరం చెందే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. ఈ తుఫాన్ ప్రభావం ఈనెల 3వ తేదీ నుంచే కనిపించనుంది. ఈ తుఫాన్ కు జవాద్ గా నామకరణం చేయనున్నారు.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలై తీవ్రప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశముండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.
ఉత్తరాంధ్రకు తుపాను హెచ్చరికల దృష్ట్యా ఆయా జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అసవరమైన అన్ని చోట్లా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. 
అలాగే తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించారు. విశాఖజిల్లాకు శ్యామలరావు, జిల్లాకు కాంతిలాల్ దండే, శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్ కుమార్ ను నియించారు. సంబంధిత అధికారులు వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లి బాధ్యతలు స్వీకరించాలని సీఎం ఆదేశించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this