Monday, January 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
YSRCP: ఎంపీ ల్యాడ్స్ డబ్బుతో చర్చిల నిర్మాణం.....

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

YSRCP: ఎంపీ ల్యాడ్స్ డబ్బుతో చర్చిల నిర్మాణం.. కేంద్రం బిగ్ షాక్.. జగన్ సర్కారుకు సంచలన లేఖ!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఎంపీ ల్యాడ్స్ నిధులపై ఏపీ సీఎస్‌కు లేఖ రాశారు.

జగన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఊహించని షాకిచ్చింది. క్రైస్తవ మతపరమైన విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో చర్చిలకు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ రమ్య.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ పంపారు.
ఎంపీలకు ప్రతి ఏటా ఇచ్చే నిధుల్లో రూ.40 లక్షలకు పైగా నిధుల్ని బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్ చర్చిలకు వినియోగించినట్లు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రెండు నెలల క్రితం వైసీపీ రెబల్ రఘురామ కృష్ణరాజు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో)కు లేఖ రాశారు.
ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన ఈ డబ్బులను మత సంబంధమైన కార్యక్రమాలకు, మతపరమైన భవనాల నిర్మాణాలకు ఖర్చు చేస్తున్నట్టుగా వచ్చిన కథనాలను ఆయన పీఎంవోకు నివేదించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మతమార్పిడులకు కూడా ఈ నిధులు వినియోగిస్తున్నట్లుగా ఎంపీ రఘురామ ఆరోపించారు.
దీంతో ఈ లేఖపై నివేదిక పంపాలని జగన్ సర్కారుకు రెండు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక పంపాలని తాజాగా కేంద్రం లేఖ రాసింది. ఇప్పటికే నివేదిక కోరినా పంపించలేదని, అందుకే మరోసారి గుర్తు చేస్తున్నట్టు పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి నివేదిక పంపాలని లేఖలో డైరెక్టర్‌ రమ్య కోరారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this