Thursday, July 10, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Student Biometric Attendance: విద్యార్థుల బయోమెట్రిక్‌కు చురుగ్గా...

AP ప్రభుత్వ ఉద్యోగులకు SBI SGSP package తో అద్భుతమైన లాభాలు మరియు సురక్షితమైన ఫైనాన్షియల్ ఫీచర్స్!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అనేక సౌకర్యాలు ఉన్నాయి, కానీ...

AP Teacher Transfers SGT Transfer Orders 2025 Released. Download Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి SGT మరియు ఇతర ఉపాధ్యాయుల బదిలీ...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

Student Biometric Attendance: విద్యార్థుల బయోమెట్రిక్‌కు చురుగ్గా ఏర్పాట్లు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • విద్యార్థుల బయోమెట్రిక్‌కు చురుగ్గా ఏర్పాట్లు
  • అమ్మఒడికి 75 శాతం తప్పనిసరి

న్యూస్‌ టోన్, మచిలీపట్నం : విద్యార్థుల హాజరు పెంచడం.. అమ్మఒడి అర్హత సాధించడం కోసం పాఠశాలల్లో బయోమోట్రిక్‌ హాజరు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల హాజరు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ ఈ-హాజరు వేస్తున్నారు. ఇక నుంచి ప్రతి విద్యార్థి బడిలోని ప్రత్యేక డివైజ్‌ ద్వారా వేలిముద్ర హాజరు వేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. నవంబరు ఒకటి నుంచి కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈనెల 8 నుంచి జిల్లాలో అమలు చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌ తర్వాత విద్యార్థుల హాజరు తక్కువగా నమోదవుతోంది. ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే తీరు. అమ్మఒడి ద్వారా హాజరు పెంచవచ్చని చెబుతున్నారు.

జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 4,628 పాఠశాలలున్నాయి. వీటిలో 4,04,787 మంది విద్యార్థులు చదువుతున్నారు. పురపాలక సంఘాలతో పాటు జడ్పీ, ఎంపీపీ, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల గురుకుల పాఠశాలలు తెరిచినా ఇంకా హాజరు పెరగలేదు. దాంతో విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. విద్యా సంవత్సరాన్ని కూడా కుదించారు. హాజరు 75 శాతం వచ్చిన వారికి అమ్మఒడి ఇవ్వాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది. ‘నాడు- నేడు’ కింద బడుల బాగుకు పెద్దఎత్తున వ్యయం చేసింది. ఉపాధ్యాయుల నియామకం.. 3, 4, 5 తరగతుల విలీనం వంటి ప్రక్రియ జరుగుతోంది.

పెరిగిన ప్రవేశాలు..

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు ఈ ఏడాది కాస్త పెరిగాయి. ఇక్కడ వివిధ రకాల వస్తు సామగ్రి అందించడం.. ఆంగ్ల బోధన జరుగుతుండటంతో తల్లిదండ్రులు పిల్లలను వీటికే పంపుతున్నారు. దాంతో 10 నుంచి 15 శాతం మేర ప్రవేశాలు పెరిగాయి. తరగతుల నిర్వహణలో కాస్త జాప్యం జరిగింది. గతేడాది ఆన్‌లైన్‌ ద్వారా పరిమితంగా తరగతులు నిర్వహించారు. ఈ ప్రభావం పది, ఇంటర్‌పై పడింది. కొందరికి మాత్రమే ఆశించిన మార్కులు రాగా ఎక్కువ మంది నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో హాజరు పెంచి తరగతులు పరిపుష్ఠం చేయాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈనెల 8 నుంచి అన్ని బడుల్లో ఈ-హాజరు అమలు చేయనున్నారు. ఇందుకు అవసరమైన డివైజ్‌లకు ఆర్డర్లు పెట్టినట్లు సమాచారం. వీటిని విద్యాశాఖ సిద్ధం చేసిన ప్రత్యేక యాప్‌ల ద్వారా అనుసంధానం చేసి ఆధార్‌ అనుసంధానంగా హాజరు తీసుకోనున్నారు. ఈ విషయమై గూడూరు ఉప విద్యాశాఖాధికారి డాక్టర్‌ కోడివాక వెంకటేశ్వర్లును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. విద్యార్థుల సంఖ్య, బడి హాజరు పెంచడం.. పోషకాహారం అందజేయడం లక్ష్యంగా బయోమెట్రిక్‌ విధానం ఉపకరిస్తుందని తెలిపారు. బడి మానేసే వారి సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this