Saturday, December 27, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Without Ration Card : రేషన్ కార్డు...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

Without Ration Card : రేషన్ కార్డు లేకుండా ఉచితంగా బియ్యం, గోధుమలు పొందడం ఎలా..? ఇలా చేస్తే మీరు కూడా అర్హులవుతారు..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Without Ration Card : కరోనా కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ 9వ సారి దేశాన్ని ఉద్ధేశించి ప్రసంగించారు. 

కరోనాకు వ్యతిరేకంగా చేసిన పోరాటం, రెండో వేవ్‌ను ఎదుర్కోవటానికి చేసిన ప్రయత్నాలు, ఆక్సిజన్ డిమాండ్, సరఫరా, కరోనా టీకా, 80 కోట్లకు పైగా దేశస్థులకు ఉచిత ఆహార ధాన్యాలు వంటి అంశాల గురించి ప్రసంగించారు. దేశవాసులకు ఉచిత రేషన్ ప్రకటించిన ప్రధాని మోదీ ప్రధాన్ మంత్రి గారిబ్ కల్యాణ్ అన్నా యోజనను దీపావళి వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి ఉన్న ఈ సమయంలో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. నవంబర్ నాటికి 80 కోట్లకు పైగా దేశస్థులకు ప్రతి నెలా ఉచిత ఆహార ధాన్యాలు లభిస్తాయని స్పష్టం చేశారు.

రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం ప్రయోజనం లభిస్తుంది..

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన కింద రేషన్ కార్డు లేని వారికి కూడా ఉచిత ఆహార ధాన్యాలు లభిస్తాయి. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవటానికి వారు ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ విషయంలో ప్రధాని మోదీ ప్రకటించిన తరువాత ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే, అతను తన ఆధార్ తీసుకొని రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుందని, ఆ తర్వాత అతనికి స్లిప్ ఇస్తామని ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ స్లిప్ చూపించిన తరువాత వారికి ఉచిత ఆహార ధాన్యాలు లభిస్తాయని తెలిపారు.

పేద కూలీలకు ఉచిత రేషన్ ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని కోరారు. గరీబ్ కల్యాణ్ అన్నా యోజన కింద లభించే ఉచిత 5 కిలోల ఆహార ధాన్యాలు రేషన్ కార్డులో లభించే ఆహార ధాన్యాల కోటాతో పాటు ఉంటాయి. అంటే రేషన్ కార్డులో ఇప్పటికే ఆహార ధాన్యాలు పొందిన వారికి 5 కిలోల ఎక్కువ రేషన్ లభిస్తుంది. దీని కోసం వారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మహమ్మారి సమయంలో ఏ పేదలూ ఆకలితో నిద్రపోకూడదనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అంతకుముందు కరోనా రెండో వేవ్‌ మధ్యలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండు నెలలు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది దానిని ఇప్పుడు నవంబర్ వరకు పొడిగించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this