- జూన్ 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు…
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు జూన్ 10 నుంచి మారబోతున్నాయి. కర్ఫ్యూ సమయాల్లో మార్పు కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వద్ద సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ఫ్యూ సమయాలు మార్చాలని నిర్ణయించారు. కరోనా కేసుల్లో కొంత తగ్గుదల ఉండటంతో జూన్ 10 నుంచి తదుపరి నిర్ణయం తీసుకునే వరకు సడలింపు వేళలు మార్చారు. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. అది జూన్ 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీసు వేళలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వారు డ్యూటీలు చేయవలసి ఉంటుంది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఇవే వేళలు అమల్లో ఉంటాయి.
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.