Friday, February 27, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
New Education Policy: ఫౌండేషన్ స్కూల్స్...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

New Education Policy: ఫౌండేషన్ స్కూల్స్ ప్రాజెక్టుకు?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • పాఠశాల విద్యాశాఖ ఆలోచన
  • కాంట్రాక్టు పద్ధతిలోనే పోస్టులు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

New Education Policy:  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 5+3+3+4 విధానం ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు తెచ్చేలా ఉంది. నూతన వ్యవస్థలో (ప్రైమరీ, 1, 2 తరగతులను ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ ఫౌండేషన్ స్కూల్స్న ప్రాజెక్టు గానీ, సొసైటీ గానీ అప్పగించాలని విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అంశంపై ప్రస్తావించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక విద్యలో శాశ్వత ప్రతిపాదికనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. ప్రాజెక్టు గానీ, సొసైటీ గానీ ఈ స్కూల్స్న అప్పగిస్తే ఈ నిబంధనకు నీళ్లుదిన్నట్లే అవుతుంది. ఫౌండేషన్ స్కూల్స్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారిని తీసుకుంటారా? వేతనాలు అందుకు తగ్గట్టుగా ఇస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారనుంది. రాష్ట్రంలో 34 వేల ప్రాథమిక పాఠశాలల్లో 86 వేల ఎస్ జిటి ఉపాధ్యాయ మంజూరు పోస్టులుంటే 70 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. 16 వేలపోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో ఫౌండేషన్ స్కూల్కు ఒక ఎసిటి ఉండాలని నూతన వ్యవస్థలో పేర్కొన్న విధంగా 34 వేల మంది కేటాయించబడతారు. తక్కిన పోస్టుల్లో కొన్నింటిని అంగన్వాడీలతో నింపినా ఎక్కువ పోస్టులను వాలంటీర్లతో నింపే అవకాశం ఉంది. మిగిలిన 36 వేల మంది హైస్కూళ్లకు కేటాయించబడతారు. అప్పుడు ప్రభుత్వ స్కూల్లో ఈ 16 వేల రెగ్యులర్ టీచర్ పోస్టులకు మంగళహారతి పాడినట్టే అవుతుందని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఇక రెగ్యులర్ డిఎసి సి ఉండకపోవచ్చునని నిరుద్యోగ ఉపాధ్యాయులు కలవరపడుతున్నారు. అదేవిధంగా హైస్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఏ మీడియంలో చదువుకుంటే దానినే కొనసాగిస్తామని విద్యాశాఖ చెబుతోంది. ఒక్క మీడియంలో మాత్రమే పాఠశాలలు నిర్వహిస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 20 వేలు కోల్పోయే ప్రమాదం ఉందని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2018లో డిఎస్సీ ద్వారా సుమారు 6 వేల ఉపాధ్యాయ పోస్టులను మాత్రమే విద్యాశాఖ భర్తీ చేసింది. మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. అవసరమైన మేరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా కొత్త ప్రయోగాలు చేయడం రెగ్యులర్ ఉపాధ్యాయ పోస్టులకు ఎగనామం పెట్టడం కోసమేనని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this