Covid Third Wave: థర్డ్ వేవ్ ఎప్పుడు...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Covid Third Wave: థర్డ్ వేవ్ ఎప్పుడు రాబోతుంది? తాజా సర్వేలో సంచలన విషయాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Covid Third Wave: దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ ఎప్పుడు రావచ్చు? వస్తే ఇది సెకండ్ వేవ్ కంటే శక్తివంతంగా ఉంటుందా? చిన్న పిల్లలే ఎక్కువగా బాధితులు అవుతారా? ఇప్పుడు ఈ అంశాలపైనే మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. థర్డ్ వేవ్ తప్పనిసరిగా వస్తుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరించడంతో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఐసీయూ  బెడ్స్‌ సంఖ్యను పెంచుకోవడం, సిబ్బంది నియామకం, మందులు సిద్ధం చేసుకోవడంపై దృష్టిసారించాయి. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.  నేపథ్యంలో థర్డ్ వేవ్‌కు సంబంధించి లోకల్‌ సర్కిల్స్ సోషల్ మీడియా వేదికపై నిర్వహించిన సర్వే నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. ఊహించిన దానికంటే ముందే దేశంలో థర్డ్ వేవ్ రావొచ్చని ఆ సర్వే తేల్చింది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఆంక్షలు పూర్తిగా ఎత్తేసిన వెంటనే మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. రెండు మాసాలుగా లాక్‌డౌన్‌లో తమ ఇళ్లకే పరిమితమైన జనం.. మరో నెల, రెండు నెలల్లో జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది థర్డ్ వేవ్‌కు దారితీసే అవకాశముందని లోకల్ సర్కిల్స్ అంచనావేసింది.

మరో రెండు మాసాల్లో రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు వెళ్తామని సర్వేలో పాల్గొన్న వారిలో 31శాతం మంది తెలిపారు. 53 శాతం మంది ఇప్పట్లో రెస్టారెంట్లకు వెళ్లే యోచన తమకు లేదని వెల్లడించారు. అలాగే షాపింగ్ కోసం మాల్స్‌కు వెళ్తామని 29 శాతం మంది తమ మనోగతాన్ని చెప్పారు. 90 శాతం మంది తమ బంధుమిత్రుల ఇళ్లను సందర్శించడం లేదా వాళ్లను తమ ఇంటికి పిలవబోతున్నట్లు తెలిపారు. అలాగే జులై మాసం నుంచి తమ ఇళ్లలో పనివాళ్లను మళ్లీ పెట్టుకోవాలని యోచిస్తున్నారు. తద్వారా ఒకట్రెండు మాసాల్లోనే జన సమూహాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తమ సర్వేలో తేలినట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. ఈ కారణాలతో ఊహించిన దానికంటే ముందే దేశంలో థర్డ్ వేవ్‌ వచ్చే అవకాశముందని హెచ్చరించింది.

దేశంలోని 314 జిల్లాలకు చెందిన 34 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 66శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు.

దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గుముఖం పడుతున్నా..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని, జనం గుమికూడే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచిస్తున్నారు. అలాగే మాస్క్‌లు, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలను తప్పక పాటించాలి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this