Corona Deaths : తెల్లవారుజామున తల్లి, ఉదయం...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Corona Deaths : తెల్లవారుజామున తల్లి, ఉదయం కొడుకు, మధ్యాహ్నం భర్త ..ముగ్గురు ఒకేరోజు మృతి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Corona Deaths : ఒకే కుటుంబం ముగ్గురిని కోల్పోయింది.. అదికూడ ఒకేరోజు ఒకరి తర్వాత ఒకరు కరోనాతో ప్రాణాలు కొల్పోయారు..

దీంతో ఆ కుటుంబలో వర్ణించలేని విషాదచాయలు అలుముకున్నాయి..ముగ్గురు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో కూడా కరోనా భయాందోళనలు అధికమయ్యాయి.

కరోనా ఎన్ని కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేస్తోంది..ఉహకందడం లేదు..కుటుంబంలో తల్లిదండ్రులు, అన్నాదమ్ములు, తల్లి కొడుకులు ఇలా ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు కరోనా బారిన పడి ప్రాణాలు కొల్పోతున్న దయనీయ స్థితి నెలకొంది..దీంతో కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతుండగా చాల మంది పిల్లలు తల్లి దండ్రులను కోల్పోతుండడంతో అనాథాలుగా మిగులుతున్నారు..

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓకే రోజు ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన విషాద ఘటన తెలంగాణ జిల్లాల్లో చోటు చేసుకుంది..ఒకరి తర్వాత ఒకరు కరోనాతో మృత్యువాత పడడం గ్రామంలో భయాన్ని నెలకోల్పింది. ఉదయం రాత్రి ఒకరు ,తెల్లవారు జామున మరొకరు మధ్యాహ్నం మరొకరు ఇలా ముగ్గురు ఒకే సారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో చెప్పలేని దు:ఖం నిండుకుంది..

వివరాల్లోకి వెళితే..నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగిలిమడకకు చెందిన ఓకే కుటుంబంలో ముందుగా తల్లి, ఆ తర్వాత కొడుకు ..అనంతరం తండ్రి కొద్ది గంటల వ్వవధిలోనే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు..కాగా గ్రామంలో భద్రయ్య ఆయన కొడుకు శంభులింగంలు ఆర్ఎంపీలుగా గ్రామానికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా శంభులింగం కరోనా భారిన పడడంతో మే 24న మహబుబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు..అయితే కొడుకు చికిత్స పొందుతుండగానే తండ్రి భద్రయ్య తల్లి శశికళకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారు కూడ మే 30న అదే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అయితే ముగ్గురు కరోనా భారిన పడడమే కాకుండా వారిని విధి వక్రీకరించింది..చికిత్స పొందుతున్న ముగ్గురిలో తల్లి శశికళ ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందగా..ఉదయం పది గంటల సమయంలో కుమారుడు శంభులింగం కూడ మరణించాడు. కరోనాతో మృతి చెందడంతో ఉదయమే తల్లి కొడుకులకు అంత్యక్రియలు నిర్వహించారు..అయితే వీరి చితి మంటలు ఆరకముందే తండ్రి భద్రయ్య సైతం మధ్యహ్నం నాలుగు గంటల సమయంలో మృత్యువాత పడ్డాడు..దీంతో కుటుంబతో పాటు గ్రామంలో విషాద చాయలు నెలకొనడంతో పాటు భయాందోళనలు సైతం పెరిగాయి..ఇక మృతుడు భద్రయ్య దంపతులకు ముగ్గురు కుమారులు ఒక కూమార్తె ఉండగా శంభులింగం కు ఐదు సంవత్సరాల కొడుకు, మూడు సంవత్సరాల కూతురు ఉన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this