Sunday, February 22, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Afidavit in High Court: ఎన్నికల విధుల్లో...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Afidavit in High Court: ఎన్నికల విధుల్లో పాల్గొన్న 19 మంది ఉపాధ్యాయుల మ‌‌ృతి!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Telangana Govt.Afidavit in High Court: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల్లో 17 మంది ఉపాధ్యాయులు, జూనియర్‌ కళాశాలల అధ్యాపకుల్లో ఇద్దరు కరోనా కారణంగా మృత్యువాతపడ్డారని విద్యాశాఖ పేర్కొంది. అయితే, పోలింగ్‌ విధుల్లో ఉండగానే వారికి కరోనా సోకిందన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.

తెలంగాణలో కోవిడ్ నియంత్రణ చర్యలపై విచారణ చేపట్టిన హైకోర్టు కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకల అందుబాటు, అత్యవసర మందులు, ఇతర అంశాలపై వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అత్యు్న్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పూర్తి అఫిడవిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది. కరోనా నియంత్రణ చర్యలతో పాటు ఇప్పటివరకు చేపడుతున్న కార్యక్రమాలను కోర్టుకు వివరించింది.

ఇటీవల నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికతో పాటు వరంగల్‌, ఖమ్మం తదితర ప్రాంతాల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. విధుల్లో 9,737 మంది ఉపాధ్యాయులు, 185 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. అందులో 487 మంది టీచర్లు, అయిదుగురు అధ్యాపకులు కరోనా బారిన పడ్డారు. చనిపోయిన 17 మంది ఉపాధ్యాయుల్లో ఏడుగురు ఎస్‌జీటీలు, ఎనిమిది మంది స్కూల్‌ అసిస్టెంట్లు, ఒకరు పీఈటీ, మరొకరు టీఆర్‌టీ ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలంగాణ విద్యా శాఖ హైకోర్టుకు వివరించింది. ఇందులో వరంగల్‌ గ్రామీణ జిల్లాకు చెందిన వారు అయిదుగురు, నల్గొండలో నలుగురు, జనగామ, ఖమ్మం జిల్లాల్లో ముగ్గురేసి, వరంగల్‌ అర్బన్‌లో ఇద్దరు చనిపోయారు. బాధిత కుటుంబ సభ్యులకు అందాల్సిన ప్రయోజనాలను యుద్ధ ప్రాతిపాదికన చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదిలావుంటే రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 177 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వీరి సంక్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అనాథలుగా మారిన పిల్లలకు మూడేళ్లపాటు నెలకు రూ.2 వేలు అందిచనున్నట్లు తెలిపింది. తల్లిదండ్రుల పూర్వ వివరాలు తెలియని చిన్నారులకు బీసీ రిజర్వేషన్లు పొందేలా బీసీ ఏ ధ్రువీకరణ పత్రం ఇప్పించనున్నామన్నారు. పిల్లలందరికీ విద్యాసంస్థల్లో మూడుశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర పేర్కొంది. అత్యవసర సమయాల్లో రక్షణ కోసం పిల్లలకు సాధారణ ఫీచర్లతో కూడిన మొబైల్‌ ఫోన్లు అందించామని.. అందులో 1098, 100, సహాయ కేంద్రం, సీడబ్ల్యూసీ సభ్యులు, డీసీపీయూ అధికారుల నంబర్లు నమోదు చేశామని వెల్లడించింది. దీంతో ఆపద సమయాల్లో ఆయా చిన్నారులను రక్షించేందుకు వీలవుతుంది. కరోనాతో చనిపోయిన తల్లిదండ్రుల ఆస్తులపై హక్కుల కోసం బాధిత చిన్నారులకు న్యాయసహాయం అందించాలని న్యాయసేవా సంస్థను కోరామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

మరోవైపు, కరోనా సెకండ్ వేవ్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినవారిపై 10.34 లక్షల కేసులు నమోదు చేశామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మొత్తం రూ.41.27 కోట్లు జరిమానా విధించామని పేర్కొంది. నల్లబజార్‌లో కోవిడ్‌ మందులు, ఆక్సిజన్‌ వంటివాటిని అమ్ముతున్న వారిని గుర్తించి ఇప్పటి వరకూ 171 కేసులు నమోదు చేసినట్లు వివరించింది. ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈనెల 1 నుంచి 20 వరకు 14,62,050 మందికి హరేకృష్ణ ఫౌండేషన్‌ సహకారంతో అన్నపూర్ణ పథకం కింద ద్వారా ఉచిత భోజనం అందించామని ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు వివరించింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this