Wednesday, February 25, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
SBI Customers : ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక..!...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

SBI Customers : ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక..! ఏటీఎం నుంచి నగదు విత్‌ డ్రాలకు కొత్త నియమాల వర్తింపు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 SBI Customers : కరోనా ఉద్రిక్త వాతావరణంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బిఐ పెద్ద అడుగు వేసింది. 

ఒక రోజులో ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకునే పరిమితిని పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు మీ పొరుగు శాఖకు (హోమ్ బ్రాంచ్ మినహా) వెళ్లి ఒక రోజులో ఉపసంహరణ ఫారం నుంచి రూ. 25000 వరకు విత్ డ్రా చేయొచ్చు.

ఎస్బిఐలో నగదు ఉపసంహరణకు కొత్త నియమాలు..

(1) బ్యాంకు విడుదల చేసిన సమాచారంలో ఉపసంహరణ ఫారం ద్వారా మరొక శాఖకు వెళ్లడం ద్వారా వినియోగదారులు తమ పొదుపు ఖాతా నుంచి 25 వేల రూపాయల వరకు ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది.

(2) చెక్ ద్వారా ఇప్పుడు మరో శాఖ నుంచి 1 లక్ష రూపాయల వరకు ఉపసంహరించుకోవచ్చు.

(3) థర్డ్ పార్టీ (ఎవరికి చెక్ జారీ చేయబడింది) నగదు ఉపసంహరణ పరిమితిని 50 వేల రూపాయలకు పెంచారు.

ఎస్‌బిఐ తక్షణమే కొత్త నిబంధనలను అమలు చేసింది. ఈ నియమాలు 30 సెప్టెంబర్ 2021 వరకు వర్తిస్తాయి. నగదు ఉపసంహరించుకునే కొత్త నిబంధనలతో పాటు, బ్యాంక్ కూడా షరతులను అమలు చేసింది. థర్డ్ పార్టీ ఉపసంహరణ ఫారం ద్వారా నగదు ఉపసంహరించుకోలేమని బ్యాంక్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కాకుండా థర్డ్ పార్టీ KYC పత్రం కూడా అవసరం.

కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి బ్యాంకు శాఖలలో అనేక మార్పులు చేసిందని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు. బ్యాంకు ఇప్పుడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరుచుకుంటుంది. అలాగే బ్యాంక్ తన 50 శాతం సిబ్బందితో కలిసి పనిచేస్తోంది. ఈ పరిస్థితిలో వినియోగదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే ఎస్‌బిఐ తన వినియోగదారుల సౌకర్యాలను పెంచడానికి నగదు ఉపసంహరించుకునే నిబంధనలను మార్చింది. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవచ్చు.

ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి కొత్త నియమాలు..

ఎస్బిఐ తన రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలలో 8 ఉచిత లావాదేవీలను అందిస్తుంది. ఇందులో 5 ఎస్‌బిఐ ఎటిఎంలు, మరో 3 బ్యాంక్ ఎటిఎంల లావాదేవీలు ఉంటాయి. నాన్-మెట్రో నగరాల్లో 10 ఉచిత ఎటిఎం లావాదేవీలు ఉంటాయి. ఇందులో 5 లావాదేవీలు ఎస్బిఐతో చేయవచ్చు మరో 5 లావాదేవీలు వేరే బ్యాంకుల ఎటిఎంల ద్వారా తీసుకునే అవకాశం కల్పించింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this