MPTC ZPTC Elections Cancelled: ఏపీ హై...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

MPTC ZPTC Elections Cancelled: ఏపీ హై కోర్టు సంచలన తీర్పు… ఎన్నికల రద్దు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

MPTC ZPTC Elections Cancelled: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. ఎన్నికలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. ఎన్నికలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేయాలంటూ జనసేన పార్టీ పిటిషన్ వేసింది.. ఈ పిటిషన్ లో బీజేపీ, టీడీపీలు ఇంప్లీడ్ అయ్యాయి. వీటిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలవరించింది. ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ.. అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. 2020లో ఎన్నికలు ఎక్కడ నిలిచిపోయాయో.. అక్కడి నుంచే తిరిగి ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 8న ఎన్నికలు జరిగాయి. అదే నెల 10వ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఐతే హైకోర్టు కౌంటింగ్ పై స్టే విధించింది. ఈ నేపథ్యంలో జనసేన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేసిన ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బగా భావించవచ్చు. ఇప్పటికే ఎన్నికలు పూర్తవడంతో ఫలితాలకు సంబంధించిన డేట్ వస్తుందని భావించింది. ఐతే ఎన్నికల నిర్వహణ విషయంలో నిబంధనలు పాటించని అంశాన్ని జనసేన పార్టీ తరపు న్యాయవాదులు నిరూపించగలిగాయి. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఎన్నికలను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియకు నాలుగు వారాల సమయం ఉండాలని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవ్వగా.. ప్రభుత్వం మాత్రం కేవలం 8 రోజుల్లోనే ముగించింది. దీనిపైనే జనసేన పార్టీ అభ్యంతరం తెలుపుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెలువరించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కొత్త నోటిఫికేషన్ కు ఇంకా చాలా సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఐతే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజనల్ బెంచ్ లో సవాల్ చేసే అవకాశముంది. ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this