Schools Closed in Another State: దేశంలో...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Schools Closed in Another State: దేశంలో కోవిడ్ ఉద్ధృతం.. విద్యా సంస్థలు మూసివేసిన మరో రాష్ట్రం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కరోనా వైరస్ సుదీర్ఘకాలం కొనసాగితే సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఇటీవల ఐక్యరాజ్యసమితి హెచ్చరికలే నిజమవుతాయా? తగ్గినట్టే తగ్గి మరోసారి కరోనా విశ్వరూపం దాల్చుతోంది.

ప్రధానాంశాలు:

  • దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.
  • మూడు రోజుల్లోనే లక్షా 20వేల కొత్త కేసులు.
  • విద్యా సంస్థలను మూసివేసి ఆన్‌లైన్ తరగతులు.

దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి ఉద్ధృతం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు నెలల నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు.. గత పది రోజులుగా పెరుగుతూవస్తున్నాయి. టీకా అందుబాటులోకి రావడంతో కరోనా గండం నుంచి గట్టెక్కినట్టేనని భావిస్తుండగా.. మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్, కర్ఫ్యూలను పలు రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదుకావడంతో అక్కడ పలు నగరాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలను మూసివేసి, ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించాయి.
తాజాగా, ఈ జాబితాలో చత్తీస్‌గఢ్ కూడా చేరింది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని, తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని చత్తీస్‌గఢ్ మంత్రి రవీంద్ర చౌబే తెలిపారు. గడచిన రెండు వారాలుగా చత్తీస్‌గఢ్‌లో పాజిటివ్ కేసులు భారీగా నమోదుకావడంతో కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించారు.
దక్షిణాదిలోనూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పాఠశాలలకు విద్యార్థులు హాజరుకావడం శ్రేయస్కరం కాదని తమిళనాడు ప్రభుత్వం భావించింది. సోమవారం (మార్చి 22) నుంచి 9,10,11 తరగతుల విద్యార్థులు కూడా పాఠశాలలకు రావొద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మార్చి 22 నుంచి ఈ తరగతి విద్యార్థులు భౌతికంగా పాఠశాలలకు హాజరు కావొద్దని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో 11.33లక్షల పరీక్షలు చేయగా.. 43,846 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కి చేరింది. కొత్తగా 22,956 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,11,30,288కు చేరి.. రికవరీ రేటు 96.12శాతానికి తగ్గింది. ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 188 నమోదు కాగా.. శనివారం రికార్డు స్థాయిలో 197 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాలు 1,59,755కి చేరుకున్నాయి.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this