మచిలీపట్నం : ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీఈవో రాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం బదిలీల అంశపై జిల్లాలోని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బదిలీలపై ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. జిల్లాలో ఉపాధ్యాయుల ఖాళీలు ప్రకటించాలని పలువురు నాయకులు కోరగా ఖాళీల వివరాలను సంబంధిత వెబ్సైట్లో ప్రభుత్వ నిర్దేశించిన సమయానికి అందుబాటులో ఉంటాయని అన్నారు. ఛైల్డ్ఇన్ఫోలో విద్యార్థుల వివరాలను నమోదు చేసే సమయంలో ఇంగ్లీషు మాధ్యమం అని నమోదు చేస్తే వేరే మాధ్యమాలుగా తీసుకుంటున్నట్లు డీఈవో దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం ఖాళీలను ప్రదర్శించాలని కొన్ని సంఘాల నాయకులు కోరారు. హేతుబద్ధీకరణ, బదిలీల జీవోలో ఉన్న కొన్ని అంశాలను తొలగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇలా వివిధ అంశాలపై సమీక్షించారు. వివిధ సంఘాల నాయకులు లెనిన్బాబు, మనోహర్, నాగరాజు, కొమ్ముప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీలు
వెబ్సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్సైట్లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్లు & బాహ్య సైట్లు:
ఈ సైట్ ఇతర వెబ్సైట్లకు లింక్లను అందించవచ్చు. వాటి కంటెంట్లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్లోని కంటెంట్ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.